Foundation stone laid for CBG plant in Prakasam district today

CBG Plant: నేడు ప్రకాశం జిల్లాలో సీబీజీ ప్లాంటుకు శంకుస్థాపన

CBG Plant: ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ (సీబీజీ) ప్లాంటుకు మంత్రి నారా లోకేశ్‌ బుధవారం భూమిపూజ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ తెలిపారు. బయో ఫ్యూయల్‌ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రాజెక్టు కోసం రిలయన్స్‌ సంస్థ రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ నిధులతో మొత్తం 500 సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ల ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి హరిత, పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ప్రతి సీబీజీ ప్లాంట్‌ రోజుకు 22 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. నిరుపయోగంగా ఉన్న దాదాపు 5 లక్షల ఎకరాల భూమిని ఎనర్జీ ప్లాంటేషన్‌ కోసం వినియోగిస్తాం అని విజయానంద్‌ వెల్లడించారు.

Advertisements
నేడు ప్రకాశం జిల్లాలో సీబీజీ

సీబీజీ పెట్టుబడుల ద్వారా గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు

2035 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడమే లక్ష్యంగా.. సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామని మంత్రి లోకేశ్‌ తెలిపారు. ఇందులో భాగంగా రిలయన్స్‌ మొదటి సీబీజీ ప్లాంటును ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేస్తోందన్నారు. సీబీజీ ప్లాంట్లలో వ్యవసాయ అవశేషాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మున్సిపల్‌ ఘన వ్యర్థాలను వినియోగిస్తారు. రిలయన్స్‌ దేశంలో నాలుగు సీబీజీ హబ్‌లను ఏర్పాటు చేయనుండగా.. అందులో ఒకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటుకు నిర్ణయించింది. సీబీజీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే 110 లక్షల టన్నుల సేంద్రీయ ఎరువు ద్వారా 15 లక్షల ఎకరాల భూములను సారవంతంగా మార్చేందుకు వెసులుబాటు కలుగుతుంది. సీబీజీ పెట్టుబడుల ద్వారా గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు మెరుగవుతాయి అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Related Posts
ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!
ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!

ఢిల్లీలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న 7 నియోజకవర్గాల్లో బీజేపీ అనూహ్యంగా మంచి ప్రదర్శన చేసింది. మొదట ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆధిక్యంలో ఉన్నా, కౌంటింగ్ Read more

IPL: పోరాడి ఓడిన ముంబై
mumbai cb

వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోరు నమోదు చేయగా, Read more

శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర గారు స్పీచ్
కొల్లు రవీంద్ర

కొల్లు రవీంద్ర : రాజధాని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజా రాజధానిగా అమరావతిని రూపొందించి తీరుతాం. ఒకరికొక్కరు సమాధానం చెప్పుకోవడం కాదు. రాష్ట్ర ప్రజలకు Read more

త్రివేణి సంగ‌మంలో సాధువులు, అకాడాలు అమృత స్నానం..భారీ బందోబ‌స్తు
Saints and Akkads for amrita bath.. Huge arrangement at Triveni Sangam

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ కుంభ‌మేళాలో ఈరోజు సాధువులు, అకాడాలు, స‌న్యాసులు.. అమృత స్నానం ఆచ‌రించేందుకు సంగమం వ‌ద్ద‌కు రానున్నారు. దీంతో అక్క‌డ భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×