Notices to former MP Harsha Kumar.

Harsha Kumar: మాజీ ఎంపీ హర్ష కుమార్ కు నోటీసులు..!

Harsha Kumar: మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ కు ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై హర్ష కుమార్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్వచ్ఛ దారాలు ఉంటే తీసుకొని దర్యాప్తుకు రావాలని రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పి నోటీసులో స్పష్టం చేశారు.

Advertisements
మాజీ ఎంపీ హర్ష కుమార్

అండర్ సెక్షన్ 194 బీఎన్ఎస్ఎస్ చట్టం కింద పోలీసులు కేసు

రాజానగరం పోలీస్ స్టేషన్ నుంచి క్రైమ్ నెంబర్ 136/2025 పేరుతో నోటీసులు పంపగా.. అండర్ సెక్షన్ 194 బీఎన్ఎస్ఎస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై హర్షకుమార్ మీ వద్ద ఏమైనా సమాచారం ఇవ్వమని గతంలో ఒకసారి అడిగాం. మరోసారి అడుగుతున్నాం. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే సీసీ ఫొటోస్ కానీ.. సీసీ ఫుటేజీ వీడియోలు.. ఇంకెమైనా ఆధారాలు ఉంటే రేపు సాయంత్రం 5 గంటలకు రాజానగరం పోలీస్ స్టేషన్ కు రావాలి అని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయకూడదని.. కోరడం జరిగింది.

నేనే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రశ్నలు

రాజనగరం పోలీసులు ఇచ్చిన నోటీసులకు హర్ష కుమార్ స్పందించారు. మీరు నాకు నోటీసులు ఇవ్వడం కాదు. నేనే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు నాకు సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది అని హర్ష కుమార్ పోలీసులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా గత నాలుగు రోజుల కిందట పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే సమయంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇక ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Related Posts
HCU: గచ్చిబౌలి భూముల విచారణపై 24 కు వాయిదా
గచ్చిబౌలి భూముల విచారణను 24కి హైకోర్టు వాయిదా

​కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో విచారణలు జరిగాయి. ఈ వివాదంలో 400 ఎకరాల అటవీ భూమిని ఐటీ పార్కుల కోసం Read more

పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం
Another fire incident in Pa

ఏపీ లోని పరవాడ ఫార్మాసిటీలో మరోసారి విష వాయువుల లీకేజీ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో విష వాయువులు లీక్ కావడంతో Read more

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సా.5 వరకు తరగతులు
AP inter class

రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ ఇంటర్ కాలేజీల్లో నేటి నుంచి ఒక గంట అదనంగా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం ఇంట‌ర్మీడియట్ కాలేజీలు ఉద‌యం Read more

Andhra: మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి..డబ్బులు వసూలు
మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి..డబ్బులు వసూలు

మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి.. వాటిని రికార్డ్ చేసి, బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న గ్యాంగ్‌ను కటకటాల్లోకి పంపారు లేపాక్షి పోలీసులు. మొత్తం నలుగురు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×