IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్

IPL 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్

ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి.రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టులో ఎలాంటి మార్పులు లేవు. రాజస్థాన్ జట్టులోకి మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ తిరిగొచ్చాడు. లెఫ్టార్మ్ పేసర్ ఫజల్ హక్ ఫరూఖీని పక్కనబెట్టారు. టోర్నీలో ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు సాధించగా రాజస్థాన్ జట్టు  5 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు నమోదు చేసింది.

Advertisements

ఎక్స్ ఖాతా

మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను వీల్‌చైర్‌లో కలవడం హృదయాన్ని తాకింది. రాజస్థాన్ రాయల్స్ ఈ వీడియోను షేర్ చేయగా నెటిజన్లను కదిలించింది. కోహ్లీ తన గురువుకు ఇచ్చిన గౌరవం ఎంతో మందికి ప్రేరణగా మారింది. ఇదే సమయంలో విక్రమ్ రాథోడ్‌తో కలిసి భారత జట్టు విజయాల్లో ద్రవిడ్ పాత్రను గుర్తు చేసుకున్నారు.గాయంతో బాధపడుతూ వీల్‌చైర్‌లో ఉన్న రాహుల్ ద్రవిడ్‌ను విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి పలకరించడం హృదయాన్ని హత్తుకుంది. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకుంది. “నువ్వు చిన్నవాడివైనా లేదా 18వ నంబర్‌లో ఉన్నా, పెహ్లే తో రాహుల్ భాయ్ సే హాయ్ మిల్నా హై” అనే క్యాప్షన్‌తో షేర్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది.

టీ20 ప్రపంచ కప్‌

రాహుల్ ద్రవిడ్ హయాంలో 2022 నుంచి 2024 మధ్య కాలంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ కూడా కీలక పాత్ర పోషించారు.ఇద్దరూ అద్భుతంగా కలిసి పనిచేసి, బార్బడోస్ వేదికగా జరిగిన 2024 టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. రాథోడ్ గతంలో భారత్ తరపున ఆరు టెస్టులు కూడా ఆడారు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఫర్ఖాల్ శర్మ, యుధ్వీర్ సింగ్ చరక్, కునాల్ సింగ్ రాథోడ్, ఆకాష్ మధ్వల్, క్వేనా మఫాకా, వనిందు హసరంగా, అశోక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు

ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాల్, సుయాష్ దర్బ్, సలామ్ బెథెల్, స్వప్నిల్ సింగ్, లుంగి ఎన్గిడి, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మోహిత్ రాథీ, స్వస్తిక్ చికారా, అభినందన్ సింగ్ వంటి ఆటగాళ్లు చోటు సంపాదించారు.

Read Also: IPL 2025: మాక్స్ వెల్ పై శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం

Related Posts
రాష్ట్ర విభజనపై కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ex cm kiran kumar reddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖరరెడ్డి బతికుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని చాలా మంది Read more

తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలు
తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలు

సైబర్ మోసగాళ్లు భయం, దురాశ లేదా ఉత్సుకత వంటి లక్ష్యాల మానసిక దుర్బలత్వాలను అర్థం చేసుకుని, వాటిని తమ ప్రయోజనానికి వినియోగిస్తున్నారు అని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ Read more

కాంగ్రెస్ ప్రభుత్వం పై బండి సంజయ్ కీలక ఆరోపణలు
bandi musi

కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్.. మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.మీడియాతో మాట్లాడుతూ.. "కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం Read more

Nationwide Strike : మే 20న దేశవ్యాప్త సమ్మె
Nationwide strike2

దేశవ్యాప్తంగా పలు కార్మిక సంఘాలు మే 20న సమ్మెకు పిలుపునిచ్చాయి. కొత్త లేబర్ కోడ్‌ను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×