Nagababu సతీసమేతంగా చంద్రబాబును కలిసిన నాగబాబు

Nagababu : సతీసమేతంగా చంద్రబాబును కలిసిన నాగబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, నాగబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం మండలి చైర్మన్ కార్యాలయంలో జరగగా, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, జనసేన నేతలు హాజరయ్యారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను ప్రదర్శిస్తానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని నాగబాబు ప్రమాణం చేశారు.

Advertisements
Nagababu సతీసమేతంగా చంద్రబాబును కలిసిన నాగబాబు
Nagababu సతీసమేతంగా చంద్రబాబును కలిసిన నాగబాబు

తర్వాత నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కార్యాలయానికి వెళ్లిన నాగబాబు దంపతులు చంద్రబాబుకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, నాగబాబుకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయనకు శాలువా కప్పి వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు.ఇదిలా ఉండగా నాగబాబు ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీకి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుందని నేతలు అంటున్నారు. శాసన మండలిలో జనసేన శబ్దం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related Posts
యూనివ‌ర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై లోకేశ్ వివరణ
యూనివ‌ర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై లోకేశ్ వివరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అక్రమాలకు ఇకపై తావుండదని, తప్పు చేసేవారు భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో Read more

Raghurama Krishna Raju : ఉండిలో హాజరైన డిప్యూటీ స్పీకర్ రఘురామ
Raghurama Krishna Raju : ఉండిలో హాజరైన డిప్యూటీ స్పీకర్ రఘురామ

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి ప్రాంతం ఈసారి ఆక్వా రైతులతో కిటకిటలాడింది అక్కడ జరిగిన ఆక్వా రైతుల సమ్మేళనంలో రైతుల సమస్యలు ప్రభుత్వ ప్రణాళికలపై చర్చ Read more

తూర్పు గోదావరి జిల్లాలో జీబీఎస్ కేసుల కలకలం
Confusion of GBS cases in East Godavari district

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో జీబీఎస్ కేసుల కలకలం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2 రెండు కేసు నమోదు అయ్యాయి. వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్ Read more

నేటి నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు..శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
CBN tirumala

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో నేటి నుంచి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సాయంత్రం 5 .45 గంటలకు మీనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×