Narendra Modi :ప్రధాని మోదీతో ముహమ్మద్ యూనస్‌ భేటీ!

Narendra Modi :ప్రధాని మోదీతో ముహమ్మద్ యూనస్‌ భేటీ!

భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ థాయిలాండ్‌లో బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా పాలన ముగిసిన తర్వాత బంగ్లాదేశ్‌ ప్రతినిధితో ప్రధాని మోదీ సమావేశం కావడం ఇదే మొదటిసారి.బిమ్‌స్టెక్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా యూనస్‌తో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు.

Advertisements

మోదీతో భేటీ

చైనా-బంగ్లాల మధ్య మిత్రుత్వం పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌-బంగ్లా మధ్య చర్చలు జరగడం గమనార్హం. వాస్తవానికి మోదీతో భేటీ కోసం యూనస్‌ తరఫున బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ భారత్‌ను అభ్యర్థించింది.తాము భారత ప్రధానితో సమావేశం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పడంతో ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి భేటీకి ఒప్పుకున్నారు. షేక్‌ హసీనా దేశం వీడిన నాటినుంచి భారత్‌-బంగ్లా సంబంధాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఆ దేశంలోని మైనార్టీల రక్షణపై భారత్‌ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది.

మహమ్మద్‌ యూనస్‌

ఇటీవల మహమ్మద్‌ యూనస్‌ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా భారత్-బంగ్లా మధ్య దూరం పెంచింది. ఈ వ్యాఖ్యలను మన విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఖండించారు. ఈశాన్య రాష్ట్రాలకు రోడ్లు, రైళ్లు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్లు ఉన్నాయన్నారు. బిమ్‌స్టెక్‌ దేశాలకు ఇది కీలకమైన కనెక్ట్‌విటీ హబ్‌గా అభివర్ణించారు.దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఘాటుగా స్పందిస్తూ, బంగాళాఖాత ప్రాంతంలో భారతదేశ వ్యూహాత్మక ప్రాముఖ్యతను, విస్తృతమైన అనుసంధానతను నొక్కి చెప్పారు. భారత్‌కు 6,500 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, బిమ్‌స్టెక్ లోని ఐదు సభ్య దేశాలతో భూ సరిహద్దులు పంచుకుంటోందని ఆయన గుర్తుచేశారు. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్ల విస్తృత నెట్‌వర్క్‌తో ఈశాన్య ప్రాంతాన్ని కనెక్టివిటీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, భారత ఉపఖండం, ఆగ్నేయాసియా మధ్య భారత్ కీలక వారధి అని ఆయన స్పష్టం చేశారు.

Modi Yunus Meet

బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం ఆగస్టులో కూలిపోయింది.ఆగస్టు 5న ఆమె బంగ్లాదేశ్ విడిచి, భారత వైమానిక దళ విమానంలో ఢిల్లీ సమీపంలోని హిందన్ వైమానిక స్థావరానికి చేరుకున్నప్పటి నుండి భారతదేశంలోనే ఉంటున్నారు.బంగ్లాదేశ్‌ పరిస్థితులపై భారత్‌ తీవ్ర ఆందోళన చెందుతోంది. గతేడాది ఆగస్టులో షేక్ హీసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యూనస్ నాయకత్వంలోనే ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం అనుసరిస్తోన్న తీవ్రవాద విధానాలు, వేర్పాటువాదులను జైళ్ల నుంచి విడుదల చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Related Posts
లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వతంపై ప్రమాదం: ఒండ్రెజ్ హుసెర్కా మరణం
mountain

ఒక ప్రముఖ స్లోవాక్ పర్వతారోహకుడు ఒండ్రెజ్ హుసెర్కా 7,234 మీటర్ల ఎత్తులో ఉన్న నేపాల్‌లోని లాంగ్‌టాంగ్ లిరుంగ్ పర్వతాన్ని ఎక్కిన తర్వాత ప్రమాదవశాత్తు మరణించారు. ఈ శిఖరం Read more

అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం రేఖా
rekha gupta sleeping

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అసెంబ్లీలో నిద్రపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సభలో సభ్యులు చర్చలు జరుపుతున్న సమయంలో ఆమె కునుకు తీశారు. ఈ Read more

Yemen: యెమెన్‌లో అమెరికా వైమానిక దాడులు ట్రంప్ హెచ్చరిక
Yemen: యెమెన్‌లో అమెరికా వైమానిక దాడులు ట్రంప్ హెచ్చరిక

యెమెన్‌లో అమెరికా దాడులు – 24 మంది మృతి యెమెన్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. హౌతీ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని Read more

ఖతార్ అమీర్‌కు ప్రధాని మోదీ స్వాగతం
ఖతార్ అమీర్‌కు ప్రధాని మోదీ స్వాగతం

ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ మంగళవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరపడానికి హైదరాబాద్ హౌస్‌లో చేరారు. ఈ సమావేశం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×