రష్మిక వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది.’పుష్ప 2’తో పాటు బాలీవుడ్లో ‘చావా’ సినిమాతో మరో హిట్ అందుకుంది.అయితే ఆమె విజయాలకే కాకుండా కొన్ని వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారింది. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.కర్ణాటక ఎమ్మెల్యే రవికుమార్ గనిగ ఇటీవల రష్మికపై సంచలన వ్యాఖ్యలు చేశారు.రష్మికకు తగిన గుణపాఠం చెప్పాలని ఆమె వ్యవహారశైలిని తప్పుబడుతూ మాట్లాడారు. ఓ కార్యక్రమానికి రష్మికను ఆహ్వానించగా, ఆమె “కర్ణాటక ఎక్కడుందో నాకు తెలియదు” అన్నట్లుగా స్పందించిందని ఆయన ఆరోపించారు. ఆమె కెరీర్ను ఆదరించిన ఇండస్ట్రీనే గౌరవించడం లేదని మండిపడ్డారు.రష్మిక బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరుకావాలని కోరినా,ఆమె నిరాకరించిందని విమర్శించారు.రష్మికపై విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి.

“మేము ఎన్నిసార్లు రష్మికను ఫెస్టివల్కు రావాల్సిందిగా కోరినా, ఆమె స్పందించలేదు.తన ఇల్లు హైదరాబాద్లో ఉందని, కర్ణాటకకు రావడానికి తాను వీలుకలిగి ఉండడం లేదని చెప్పిందట.ఇది నిజమైతే, ఆమె తీరును ఖండించాల్సిందే,” అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆమెపై కర్ణాటకలో అసంతృప్తి మరింత పెరిగింది.ఈ వివాదం మరింత వేడెక్కుతున్న తరుణంలో, కోడవ జాతీయ మండలి అధ్యక్షుడు ఎన్.యు. నాచప్ప రష్మికకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్లకు లేఖ రాశారు. రష్మిక వ్యక్తిగత జీవితానికి హాని జరుగకూడదని కోరారు.తాజాగా ఎమ్మెల్యే రవికుమార్ గనిగ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.
“నేను వ్యక్తిగతంగా రష్మికను విమర్శించాలనుకోలేదు.నా వ్యాఖ్యల ఉద్దేశ్యం ఆమెను జీవిత పాఠాలు నేర్పించాలన్నదే. ఆమెను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం కాదు,అని ఆయన స్పష్టం చేశారు.”మీరు మీకు స్థానం ఇచ్చిన భూమిని గౌరవించాలి. కర్ణాటక మీను పోషించింది. మీరు ఆ రాష్ట్రాన్ని గౌరవించకపోతే, అది సరైనదా?” అని ఆయన ప్రశ్నించారు. తన వ్యాఖ్యల వెనుక ఉన్న భావాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రష్మిక అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, కొందరు ఆమె కర్ణాటక పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని విమర్శిస్తున్నారు. ఈ వివాదం రష్మిక కెరీర్పై ఏమేరకు ప్రభావం చూపుతుందో చూడాలి!