అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన నాలుగు రోజుల భారత పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ఆయనతో పాటు భార్య ఉష వాన్స్, ముగ్గురు పిల్లలు కలిసి బుధవారం జైపూర్ నుంచి ప్రత్యేక విమానంలో వాషింగ్టన్కు పయనమయ్యారు. అధికార వర్గాల ప్రకారం, ఈ పర్యటనలో వాన్స్ కుటుంబం భారత సంప్రదాయాలను ఆస్వాదిస్తూ పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించింది.ఈ పర్యటనకు శ్రీకారం చుట్టింది ఏప్రిల్ 21వ తేదీన ఢిల్లీ నగరంలో. తొలి రోజు వాన్స్ దంపతులు అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. అదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అధికారిక భేటీ జరిగింది. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇండియా-అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే దృక్పథాన్ని వాన్స్ స్పష్టంగా వ్యక్తం చేశారు.ఢిల్లీలోని అధికార కార్యక్రమాల అనంతరం ఏప్రిల్ 22న వాన్స్ కుటుంబం జైపూర్కు చేరుకుంది. అక్కడ చారిత్రక అంబర్ కోటను సందర్శించడం పర్యటనలో హైలైట్గా నిలిచింది.

శిల్ప కళ, కోట నిర్మాణ శైలి వాన్స్ దంపతులను ఆకట్టుకున్నాయి. అనంతరం జైపూర్లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న వాన్స్, భారత్-అమెరికా సంబంధాల ప్రాధాన్యతను ఉద్ఘాటిస్తూ ప్రసంగించారు.వెరైటీగా ఉన్న ఈ పర్యటనలో బుధవారం రోజున ఆగ్రా పర్యటన ప్రత్యేకంగా నిలిచింది. వాన్స్ కుటుంబం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తాజ్ మహల్ను సందర్శించి అక్కడి అందాలను ఆస్వాదించారు. స్మారక చిహ్నంగా ఫొటోలు దిగారు. అనంతరం తిరిగి జైపూర్కు చేరుకుని, అక్కడి నుంచి అమెరికా ప్రయాణం ప్రారంభించారు.వాన్స్ ఈ పర్యటనలో అధికారిక కార్యక్రమాలకు పక్కనే భారతీయ సంస్కృతిని దగ్గరగా అనుభవించారు. కుటుంబ సభ్యులు సంప్రదాయ వస్త్రధారణలో కనిపించడంతో అక్కడి ప్రజల ప్రశంసలు పొందారు. పిల్లలు జైపూర్ బజార్లో ముద్దుగా తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
Read Also : Pakistan :భారతదేశంపై విషం చిమ్మిన ప్రధాన మంత్రి చౌదరి అన్వరుల్ హక్