CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈరోజు (గురువారం) బిజీ బిజీగా ఉన్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి వచ్చారు. ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. 11.30 నుంచి 1.30 గంటల వరకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ & మిషన్ లెర్నింగ్పై వర్క్షాప్లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సాయంత్రం 06.15 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు.

ప్రధానితో చంద్రబాబు భేటీ
అయితే.. రేపు(శుక్రవారం) ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని సీఎం చంద్రబాబు కలవనున్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో చంద్రబాబు భేటీ అవనున్నారు. మే 2వ తేదీన ఏపీలో ప్రధాని మోడీ పర్యటించనున్న సమయంలో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో ఏపీ పర్యటనకు సంబంధించిన విషయాల గురించి సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చ
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మే2న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏపీకి మోడీని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అమరావతి, ఏపీకి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస చేస్తారు. ఎల్లుండి(శనివారం) ఉదయం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నానికి చేరుకుంటారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.
Read Also: మధుసూదన్ రావుకు నివాళులర్పించిన పవన్ కల్యాణ్