తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా ఏర్పడిన అన్నాడీఎంకే-బీజేపీ పొత్తుపై ముఖ్యమంత్రి స్టాలిన్ గట్టిగానే స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తు కుదిరినట్టు బీజేపీ నాయకుడు అమిత్ షా ఇటీవల ప్రకటించగా, స్టాలిన్ దీనిపై తీవ్ర విమర్శలు చేశారు.ఈ పొత్తు అధికారం కోసం కాదు, భయం వల్లే ఏర్పడిందని స్టాలిన్ తేల్చేశారు. కేంద్ర దాడుల నుంచి తప్పించుకునేందుకు అన్నాడీఎంకే తమ పార్టీని తాకట్టు పెట్టిందని ఆరోపించారు. “రెండు దాడులకు భయపడి పార్టీని తాకట్టు పెట్టినవారు, ఇప్పుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు” అని స్పష్టం చేశారు.

అన్నాడీఎంకే పూర్తిగా లొంగిపోయిందని విమర్శ
తమిళ ప్రజల అభివృద్ధికి బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. “అన్నాడీఎంకే ఇప్పుడు బానిసగా మారింది. బెదిరింపులతో రాజకీయ కుట్రలు నడిపిస్తున్నారు” అని మండిపడ్డారు. ప్రజలు వీరి కుట్రలకు తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు.ఈ పొత్తుకి బలమైన సిద్ధాంతం లేదని స్టాలిన్ తెలిపారు. అమిత్ షా విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగానికి పరంగా తగనివని అన్నారు. హిందీ ముద్దడి, మూడు భాషల విధానం, వక్ఫ్ చట్టం వంటి రాష్ట్రప్రతిష్టకు సంబంధించిన అంశాలపై స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.
“నీట్ పై వ్యాఖ్యలు దారిమళ్లించే ప్రయత్నమే”
నీట్కు వ్యతిరేకంగా తమిళనాడులో విద్యార్థులు చేసిన ఆత్మహత్యలపై అమిత్ షా వ్యాఖ్యలను స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. “నీట్ కారణంగా 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇది దారి మళ్లించడమేనా?” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న సీబీఐ విచారణలపై బీజేపీ ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దివంగత జయలలితపై ఉన్న అవినీతి కేసులను గుర్తు చేస్తూ, “ఆమె పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ నైతికతపై ఎలా మాట్లాడగలదు?” అని స్టాలిన్ ప్రశ్నించారు. బీజేపీ నైతికత చూపాలంటే తొలుత అవినీతిపై దృష్టి పెట్టాలని సూచించారు.
Read Also : Vijay : అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోరాటం: హీరో విజయ్