MK Stalin అన్నాడీఎంకే పై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

MK Stalin : అన్నాడీఎంకే పై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా ఏర్పడిన అన్నాడీఎంకే-బీజేపీ పొత్తుపై ముఖ్యమంత్రి స్టాలిన్ గట్టిగానే స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తు కుదిరినట్టు బీజేపీ నాయకుడు అమిత్ షా ఇటీవల ప్రకటించగా, స్టాలిన్ దీనిపై తీవ్ర విమర్శలు చేశారు.ఈ పొత్తు అధికారం కోసం కాదు, భయం వల్లే ఏర్పడిందని స్టాలిన్ తేల్చేశారు. కేంద్ర దాడుల నుంచి తప్పించుకునేందుకు అన్నాడీఎంకే తమ పార్టీని తాకట్టు పెట్టిందని ఆరోపించారు. “రెండు దాడులకు భయపడి పార్టీని తాకట్టు పెట్టినవారు, ఇప్పుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు” అని స్పష్టం చేశారు.

Advertisements
MK Stalin అన్నాడీఎంకే పై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
MK Stalin అన్నాడీఎంకే పై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నాడీఎంకే పూర్తిగా లొంగిపోయిందని విమర్శ

తమిళ ప్రజల అభివృద్ధికి బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. “అన్నాడీఎంకే ఇప్పుడు బానిసగా మారింది. బెదిరింపులతో రాజకీయ కుట్రలు నడిపిస్తున్నారు” అని మండిపడ్డారు. ప్రజలు వీరి కుట్రలకు తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు.ఈ పొత్తుకి బలమైన సిద్ధాంతం లేదని స్టాలిన్ తెలిపారు. అమిత్ షా విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగానికి పరంగా తగనివని అన్నారు. హిందీ ముద్దడి, మూడు భాషల విధానం, వక్ఫ్ చట్టం వంటి రాష్ట్రప్రతిష్టకు సంబంధించిన అంశాలపై స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.

“నీట్ పై వ్యాఖ్యలు దారిమళ్లించే ప్రయత్నమే”

నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడులో విద్యార్థులు చేసిన ఆత్మహత్యలపై అమిత్ షా వ్యాఖ్యలను స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. “నీట్ కారణంగా 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇది దారి మళ్లించడమేనా?” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న సీబీఐ విచారణలపై బీజేపీ ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దివంగత జయలలితపై ఉన్న అవినీతి కేసులను గుర్తు చేస్తూ, “ఆమె పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ నైతికతపై ఎలా మాట్లాడగలదు?” అని స్టాలిన్ ప్రశ్నించారు. బీజేపీ నైతికత చూపాలంటే తొలుత అవినీతిపై దృష్టి పెట్టాలని సూచించారు.

Read Also : Vijay : అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోరాటం: హీరో విజయ్

Related Posts
బీజేపీకి అభినందనలు తెలిపిన కేజీవాల్
aravind tweet

ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నో ఆశలతో కమలం పార్టీకి ప్రజలు గెలుపును అందించారని, Read more

సూసైడ్ లెటర్ చెల్లుబాటు కాదు, ఆధారాలు కావాలి: సుప్రీంకోర్టు
వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరుల నియామకం వద్దు:సుప్రీంకోర్టు

ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంలో దోషిగా తేలిన వ్యక్తిని సుప్రీంకోర్టు నిర్ధోషిగా విడుదల చేసింది. నిందితుడు మృతురాలిని అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడని, తద్వారా ఆమె ఆత్మహత్యకు Read more

ట్రంప్, ఎలోన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు
ట్రంప్, ఎలోన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు

బుధవారం అమెరికాలోని వివిధ నగరాల్లో, ట్రంప్ పరిపాలన యొక్క ప్రారంభ చర్యలను నిరసిస్తూ నిరసనకారులు గుమిగూడారు. వారు ట్రంప్, ఎలోన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. Read more

Mumbai attack 26/11: ఎట్టకేలకు భారత్‌కు వచ్చిన తహవ్వుర్ రాణా..ఆ రోజు ఏం జరిగింది?
ఎట్టకేలకు భారత్‌కు వచ్చిన తహవ్వుర్ రాణా..ఆ రోజు ఏం జరిగింది?

ముంబయి దాడుల నిందితుడు తహవ్వుర్‌రాణాను అమెరికా భారత్‌కు అప్పగించింది. ముంబయి దాడులకు బాధ్యుడైన తహవ్వుర్ రాణాను అమెరికా గురువారం అప్పగించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తెలిపింది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×