aravind tweet

బీజేపీకి అభినందనలు తెలిపిన కేజీవాల్

ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నో ఆశలతో కమలం పార్టీకి ప్రజలు గెలుపును అందించారని, వారి ఆశయాలను నిలబెట్టాలని కోరారు.

Advertisements
elhi bjp

ఈ సారి ఢిల్లీ ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి. గెలుపు కోసం ఆప్, బీజేపీ రెండు గట్టిగా ట్రై చేసాయి. ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో..బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఢిల్లీని చుట్టేశారు. మరోవైపు ఆప్ నుంచి కూడా కేజ్రీవాల్ తన శక్తినంతా ఒడ్డి..గెలుపు కోసం ప్రయత్నించారు. చివరి వరకు గట్టి పోటీయే ఇచ్చిన ఆప్.. చెప్పుకోదగ్గ సీట్లు సాధించి ప్రతిపక్షానికి పరిమితమైంది. తమకు డబల్ ఇంజిన్ సర్కారే కావాలంటూ.. ఢిల్లీ ప్రజలు కమలానికే అధికార పీఠం కట్ట పెట్టారు. దీంతో 27 ఏళ్ల తర్వాత.. ఢిల్లీలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ విజయం తో బిజెపి సంబరాలు చేసుకుంటుంది. ఇక తగ్గేదేలే అంటూ స్వీట్స్ పంచుకుంటున్నారు.

ఈ విజయంపై అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని , విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నో ఆశలతో కమలం పార్టీకి ప్రజలు గెలుపును అందించారని, వారి ఆశయాలను నిలబెట్టాలని కోరారు. గత పదేళ్లలో ప్రజల కోసం ఎంతో పనిచేశామని, ఓడిపోయినా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పార్టీ గెలుపునకు పోరాడిన ఆప్ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Related Posts
తెలంగాణ లో కొనసాగుతున్నబడ్జెట్ సమావేశాలు
తెలంగాణ లో కొనసాగుతున్నబడ్జెట్ సమావేశాలు

తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. అయితే, గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ (భారత రాష్ట్ర Read more

Vidala Rajani: హైకోర్టులో విడుదల రజినీకి లభించని ఊరట
Vidala Rajani: అవినీతి కేసులో విడదల రజనీ బెయిల్‌పై హైకోర్టు కీలక నిర్ణయం

వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని అవినీతి ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం నాడు Read more

ప్రజలను మరోసారి చంద్రబాబు మోసం చేసాడు – జగన్
jagan babu 1

జగన్ మరోసారి చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు. నేడు విజయనగరం జిల్లాలో డయేరియా తో మరణించిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల Read more

తొక్కిసలాట ఘటనపై స్పందించిన రైల్వే
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట.

ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై నార్తర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ స్పందించారు. రైల్వే స్టేషన్‌లో 14, 15వ ప్లాట్‌ఫాంల వైపు Read more

×