Kunal Kamra approaches High Court

Kunal Kamra: హైకోర్టును ఆశ్రయించిన కునాల్‌ కమ్రా

Kunal Kamra: స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేని లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో కమ్రాపై పోలీసులు ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్‌ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ వేశాడు. కమ్రా తమిళనాడు వాసి కావడంతో ఈ కేసులో అతడు మద్రాసు హైకోర్టుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

హైకోర్టును ఆశ్రయించిన కునాల్‌ కమ్రా

షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ అభివర్ణించాడు

ముంబైలోని ఖార్‌ ప్రాంతంలోని ది హాబిటాట్‌ కామెడీ క్లబ్బులో జరిగిన కార్యక్రమంలో కునాల్‌ కమ్రా దిల్‌తో పాగల్‌ హై పాటను రాజకీయ పేరడీ చేసి పాడారు. ఇందులో షిండే ను ఉద్దేశించి ద్వంద్వ అర్థం వచ్చేలా పాడారు. ఈ సందర్భంగా షిండేను ఉద్దేశించి దేశద్రోహి అంటూ అభివర్ణించాడు. ఇది షిండే అభిమానులకు కోపం తెప్పించింది. కునాల్‌కు వ్యతిరేకంగా క్లబ్‌పై శివసేన కార్యకర్తలు దాడి చేసి, ధ్వంసం చేశారు. తక్షణమే కునాల్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కునాల్‌ క్షమాపణ చెప్పాలని సీఎం ఫడ్నవీస్‌ సైతం డిమాండ్‌ చేశారు. అయితే, తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనని కునాల్‌ కమ్రా ఇప్పటికే స్పష్టం చేశారు. షిండేపై వ్యాఖ్యల నేపథ్యంలో కమ్రాపై ముంబైలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

Related Posts
వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Deputy CM Pawan Kalyan key comments on the volunteer system

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు సర్పంచ్ సంఘాలతో అమరావతిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ వాలంటీర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. Read more

Chandrababu Naidu: నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశం
Chandrababu Naidu: నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశం!

వేసవి కాలంలో తాగునీటి సమస్యను ఎదుర్కొనే ప్రమాదాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలను ప్రకటించారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ తాగునీటి కొరత తలెత్తకుండా అధికారులకు Read more

మర్రి జనార్దన్ రెడ్డికి పితృవియోగం
Marri Janardhan Reddy lost his father

హైరదాబాద్‌: నాగర్‌ కర్నూల్‌ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొన్నది. ఆయన తండ్రి మర్రి జంగిరెడ్డి (80) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా Read more

చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రూ.300 కోట్లు విడుదల
Rs. 300 crore released for Chakali Ilamma University

హైదరాబాద్‌: తెలంగాణ వీరనారిగా పిలువబడే చాకలి ఐలమ్మ పేరిట గల కోఠిలోని మహిళా యూనివర్సిటీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *