KTR meets former Governor Narasimhan in Chennai

KTR : చెన్నైలో మాజీ గవర్నర్ నరసింహన్ను కలిసిన కేటీఆర్

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు. చెన్నైలోని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శాలువతో కప్పి సత్కరించి.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని బహుకరించారు.ఈ భేటీలో కేటీఆర్‌తో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఉన్నారు.

Advertisements
చెన్నైలో మాజీ గవర్నర్ నరసింహన్ను

రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా

కాగా, కేసీఆర్ కు తుంటి విరిగినప్పుడు మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు నందినగర్ లోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ రాష్ట్రం విడిపోయాక కూడా గవర్నర్ గా కొనసాగారు. 2014 నుంచి 2019 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగారు. మాజీ గవర్నర్ కృష్ణకాంత్‌ను అధిగమించి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం పనిచేసిన గవర్నర్‌గా నరసింహన్ నిలిచారు.

దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుంది

కాగా, చెన్నైలో నిర్వ‌హించిన డీలిమిటేష‌న్ స‌ద‌స్సులో కేటీఆర్ పాల్గొని.. డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరగనున్న నష్టాన్ని అద్భుతంగా తెలియచెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇది కేవలం పార్లమెంటులో ప్రాతినిధ్యానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. నిధులు కేంద్రీకృతం కావడంతో పాటు ఆర్థిక నియంతృత్వానికి దారి తీస్తుందని దక్షిణాది భవిష్యత్తును కాలరాస్తుందని కేటీఆర్ వివరించారు. దేశం ప్రజాస్వామిక దేశమైనా భిన్న అస్తిత్వాలు, సంస్కృతులు కలిగిన ఒక సమాఖ్య రాష్ట్ర అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాల‌న్నారు.

Related Posts
రాష్ట్రీయ విద్యా దినోత్సవం!
edu

ప్రతి సంవత్సరం నవంబర్ 11న రాష్ట్రీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాము. ఈ రోజు, భారతదేశం స్వతంత్రం తరువాత తొలి విద్యా మంత్రి అయిన మౌలానా అబుల్ కలామ్ Read more

ఆంధ్రప్రదేశ్‌లో 65 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ లో 65 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం విశాఖపట్నంలో పర్యటించి, కొన్ని కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం మరియు మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 2024లో మూడవసారి ప్రధాన మంత్రిగా Read more

Betting Apps Case : హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ !
Vishnu Priya approaches the High Court!

Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో Read more

ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కష్టంగా మారిన మృతదేహాల వెలికితీత
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కష్టంగా మారిన మృతదేహాల వెలికితీత

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్‌లో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని కలిగించింది. ఈ ప్రమాదంలో 8 మంది ఇంజనీర్లు మరియు కార్మికులు టన్నెల్‌లో చిక్కుకుపోయారు.టన్నెల్‌లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×