ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి సెమీఫైనల్ నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతోంది. ఇక్కడ రెండు జట్లు తొలిసారి తలపడనున్నాయి. క్రిక్బజ్ ప్రకారం, సెమీ-ఫైనల్ మ్యాచ్ కొత్త పిచ్పై జరుగుతుంది.
టాస్ ఓడిన భారత్
భారత జట్టు చివరిసారిగా టాస్ గెలిచిన మ్యాచ్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు ముందు జరిగింది. నవంబర్ 19న అహ్మదాబాద్లో ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్కు టాస్ ఓడిన భారత్, ఆ తర్వాత నుంచి ఒక్క వన్డేలోనూ టాస్ గెలవలేకపోయింది.భారత జట్టు 2023 నవంబర్ 19న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఇప్పటివరకు 14 సార్లు టాస్ గెలవలేకపోయింది. ఇదే ఏడాది డిసెంబర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. ఆ తర్వాత 2024 ఆగస్టులో శ్రీలంకతో ఆడిన మూడు వన్డేల సిరీస్ లోనూ భారత్ ది అదే పరిస్థితి.
14వ సారి టాస్ ఓడిన రోహిత్
భారత క్రికెట్ జట్టు వన్డేల్లో వరుసగా అత్యధిక మ్యాచ్లలో టాస్ ఓడిన జట్టుగా అవాంఛిత రికార్డు సృష్టించింది. 2023 నవంబర్ 19న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకు 14 వరుస మ్యాచ్లలో టీమిండియా టాస్ గెలవలేకపోయింది. తాజా ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడంతో ఈ రికార్డు మరింత పెరిగింది.

దుబాయ్లోని అంతర్జాతీయ స్టేడియంలో భారత్ వర్సెస్ఆ స్ట్రేలియా మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. రోహిత్ శర్మ వన్డేల్లో వరుసగా 14వ సారి టాస్ ఓడిపోయాడు.
కెప్టెన్ స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ, ‘మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది చాలా పొడి ఉపరితలంలా కనిపిస్తోంది. భారత్ చాలా మంచి జట్టు. ఆస్ట్రేలియా జట్టు రెండు మార్పులతో వస్తోంది. మాథ్యూ షార్ట్, కూపర్ కొన్నోలీ, స్పెన్సర్ జాన్సన్ స్థానంలో తన్వీర్ సంఘకు అవకాశం లభించింది. అదే సమయంలో, భారత జట్టు గత మ్యాచ్ ప్లేయింగ్-11లో ఎటువంటి మార్పులు చేయలేదు.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.