India reacts strongly to Pakistan accusations

పాకిస్థాన్‌ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన భారత్‌

మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో పాక్‌ లేదు..

జెనీవా : దాయాది దేశం మరోసారి అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై తన అక్కసు వెల్లగక్కింది. తాజాగా జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో దాయాది దేశం ఆరోపించింది. ఈ ఆరోపణలను భారత్‌ ఖండించింది. అంతేకాక.. మాకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది. జెనీవాలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్‌ను ఉద్దేశించి పాక్‌ న్యాయ, మానవ హక్కుల మంత్రి అజం నజీర్‌ తరార్‌ వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత రాయబారి క్షితిజ్‌ త్యాగి దీటుగా స్పందించారు.

పాకిస్థాన్‌ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన

ఆ దేశ వాక్‌చాతుర్యంలోనే కపటత్వం కన్పిస్తోంది

కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్‌, లద్ధాఖ్‌లు ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. దశాబ్దాల తరబడి పాకిస్థాన్‌ ఉగ్రవాదం కారణంగా దెబ్బతిన్న ఆ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలను హింసించడంతో సహా ప్రజాస్వామ్య విలువలను పాటించని దాయాది దేశం భారత్‌కు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో లేదు. ఆ దేశ వాక్‌చాతుర్యంలోనే కపటత్వం కన్పిస్తోంది. ఐరాస జాబితాలోని పలు ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం ఆశ్రయం కల్పిస్తుంది.

తమ దేశంలోని ప్రజలకు సుపరిపాలనను అందించడంపై దృష్టి

ప్రజాస్వామ్య పురోగతి, ప్రజలకు గౌరవం కల్పించడం వంటి వాటిపై భారత్‌ దృష్టిసారిస్తుంది. ఆ దేశం మాపై ఆరోపణలు చేయడం మానేసి.. తమ దేశంలోని ప్రజలకు సుపరిపాలనను అందించడంపై దృష్టిపెట్టాలి అని త్యాగి పేర్కొన్నారు. ఇక, ఇటీవల చైనా అధ్యక్షతన జరిగిన భద్రతామండలి సమావేశంలోనూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్‌ ఇషక్‌ దార్‌ జమ్మూకశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తారు. దీనికి సైతం భారత్‌ ఘాటుగా స్పందించింది. జైషే మహమ్మద్‌ వంటి సంస్థలను ప్రోత్సహించే పాక్‌.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పడం అత్యంత హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తంచేసింది.

Related Posts
మూడోరోజు భారీగా నష్టపోయిన మార్కెట్లు
మూడోరోజు భారీగా నష్టపోయిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, చైనా ఆర్థిక Read more

లెబనాన్‌లో పిల్లల మరణాలు పెరుగుతున్నాయి: యునిసెఫ్ నివేదిక
children

లెబనాన్‌లో గత రెండు నెలలుగా తీవ్ర హింసా పరిస్థితులు నెలకొన్నాయి. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఏజెన్సీ (యునిసెఫ్) తాజా నివేదిక ప్రకారం, 200కి పైగా పిల్లలు మరణించగా, Read more

విశాఖలో లగ్జరీ క్రూయిజ్ షిప్ సిద్ధం
విశాఖలో లగ్జరీ క్రూయిజ్ షిప్ సిద్ధం

విశాఖపట్నం పోర్టులో క్రూయిజ్ షిప్ సేవలు పెరుగుతున్నాయి. తాజాగా, కార్డేలియా క్రూయిజ్ షిప్ విశాఖపట్నం చేరుకునే సమయం ఖరారైంది. ఈ క్రూయిజ్ షిప్ సర్వీసుల గురించి విశాఖపట్నం Read more

విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేశ్‌
విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేశ్‌

అమరావతి: తన పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారంటూ సాక్షి దినపత్రికపై వేసిన పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు Read more