I like the post of Home Minister.. Rajagopal Reddy

Rajagopal Reddy : నాకు హోంమంత్రి పదవి అంటే ఇష్టం: రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy : తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి వస్తుందనే అనుకుంటున్నా. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలి. భువనగిరి పార్లమెంట్ బాధ్యతలు ఇస్తే సమర్థవంతంగా నిర్వహించా. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తా, ప్రజల పక్షాన నిలబడతా అన్నారు.

Advertisements
నాకు హోంమంత్రి పదవి అంటే

మంత్రి వర్గ విస్తరణకు సానుకూల సంకేతాలు

నిన్న ఢిల్లీలో సీరియస్‌గానే కేబినెట్‌ విస్తరణపై చర్చ జరిగినట్లు ఉంది. అయితే నాకు ఇప్పటివరకు ఢిల్లీ నుంచి ఫోన్ రాలేదు..అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం అమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పెద్దలు మంత్రి వర్గ విస్తరణకు సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజా మంత్రి వర్గ విస్తరణలో కనీసం నలుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం.

క్యాబినేట్‌ విస్తరణతో పాటు ఇతర పదవులు నామినేటెడ్ పోస్టులు

కాగా, తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపుగా ఖరారు అయింది. ఉగాది నాటికి విస్తరణ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గత ఏడాదిన్నరగా విస్తరణకు సంబంధించి అనేక ఊహగానాలు వినిపించినప్పటికీ తాజాగా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. క్యాబినేట్‌ విస్తరణతో పాటు ఇతర పదవులు నామినేటెడ్ పోస్టుల నిర్ణయం తీసుకోనున్నారు. నిన్న (సోమవారం) ముఖ్యమంత్రి ఢిల్లీలో పార్టీ ఆగ్రనేత‌ల‌తో భేటీ అయ్యారు. సీఎంతో పాటు డిప్యూటి సీఎం భ‌ట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్‌, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Related Posts
వికారాబాద్‌లో ముగ్గురు సీఐలు, 13మంది ఎస్‌ఐలు సస్పెన్షన్
three cis and 13 sis were suspended in vikarabad

three-cis-and-13-sis-were-suspended-in-vikarabad హైదరాబాద్: అక్రమాల్లో భాగం కావడం, అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు పలువురు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేశారు. తెలంగాణలో మల్టీజోన్-2లోని 9 జిల్లాల్లో అక్రమ ఇసుక Read more

బీమా విధానంలో ఆరోగ్యశ్రీ – మంత్రి సత్యకుమార్
బీమా విధానంలో ఆరోగ్యశ్రీ - మంత్రి సత్యకుమార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ)ను బీమా విధానంలోకి మారుస్తున్నట్లు రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం-ట్రస్టు విధానంలో అమలవుతున్న Read more

ఏపీలో కూడా కులగణన చేపట్టాలి : వైఎస్ షర్మిల
Caste census should be conducted in AP too.. YS Sharmila

అమరావతి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని.. ఇదో చారిత్రాత్మక ఘట్టమని.. ఈ సర్వే యావత్ భారతవనికి దిక్సూచి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ Read more

Myanmar Earthquake: మయన్మార్ భూకంపం: 3,085కి చేరిన మృతుల సంఖ్య
మయన్మార్ భూకంపం: 3,085కి చేరిన మృతుల సంఖ్య

మయన్మార్‌లో ఒక వారం క్రితం సంభవించిన భారీ భూకంపంలో మరింతగా మృతుల సంఖ్య పెరిగాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య 3,085కి చేరినట్లు సైనిక ప్రభుత్వం ప్రకటించింది. 7.7 Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×