క్షణికావేశంతో భార్యను హతమార్చిన భర్త

క్షణికావేశంతో భార్యను హతమార్చిన భర్త

హైదరాబాద్ బోరబండలో ఓ భర్త అనుమానంతో భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన కలకలం రేపింది.మహబూబ్​నగర్​జిల్లా తాటికొండ గ్రామానికి చెందిన జెట్టెం నరేందర్‌కు 27 ఏళ్ల కిందట రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి ప్రాంతానికి చెందిన పద్మలతతో మ్యారేజ్అయ్యింది. దంపతులు ప్రస్తుతం నగరంలోని రహ్మత్​నగర్​పరిధిలోని రాజీవ్​గాంధీనగర్​లో నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సుష్మ, తనయుడు శ్రీమన్నారాయణ ఉన్నారు. కుమార్తె ఎంఎస్​కంప్లీట్ చేసి అమెరికాలో ఉంటుంది. కుమారుడు ఢిల్లీ ఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

Advertisements

ఘర్షణ

నరేందర్ ఓ అనుమానపు పక్షి అని బంధువులు చెబుతున్నారు. పెళ్లైన నాటి నుంచి భార్యను అనుమానించి వేధించి,గొడవలు పెట్టుకునేవాడు. అయినా సరే పిల్లలు కారణంగా పద్మలత ఆ బాధలు భరించింది. అయితే బుధవారం దంపతుల మధ్య ఘర్షణ చెలరేగింది.విచక్షణ కోల్పోయిన భర్త ఆమెను కొట్టాడు. దీంతో కోపంలో ఆమె బ్యాగు సర్దుకుని తన పుట్టింటికి వెళ్లేందుకు సిద్దమైంది. దీంతో నరేందర్ మరింత రెచ్చిపోయాడు.నరేందర్ మరింత కోపంతో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. గదిలో బంధించి తలుపులు వేసి, హాల్‌లో నిద్రపోయాడు. తెల్లారిన తర్వాత పాలు పోసి వచ్చాక భార్యను నిద్ర లేపేందుకు వెళ్లాడు. అయితే ఆమె చనిపోయిందని గుర్తించి, నేరుగా బోరబండ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు.

పాల వ్యాపారం

భర్త చేసే కిరాణ, పాల వ్యాపారంలో తన వంతు పాత్ర పోషించింది. పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలని ఆమె ఆరాటపడేదని బంధువులు చెబుతున్నారు. 

narender padmalatha

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.అయితే నరేందర్ భార్య గొంతు నులిమినప్పుడు ఆమె ముక్కులో నుంచి రక్తస్రావం అయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పద్మలతను హత్య చేసిన తర్వాత కూడా నరేందర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవి అని బంధువులు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు, ఆవేశంతో చేసిన చర్యలు జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, అనుమానాలు, అసహనం ఇవన్నీ ఆవేశానికి దారి తీస్తాయి . ఆవేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు మానసికంగా, శారీరకంగా,బాధిస్తాయి.

Related Posts
Malla reddy: సమ్మర్ ట్రిప్ లో మస్తు ఎంజాయ్ చేస్తున్న మల్లన్న దంపతులు
Malla reddy: సమ్మర్ ట్రిప్ లో మస్తు ఎంజాయ్ చేస్తున్న మల్లన్న దంపతులు

జపాన్‌లో చిల్ మోడ్‌లో మల్లారెడ్డి దంపతులు డీజే టిల్లు కాదు.. ఈ సారి టోక్యో వీధుల్లో దుమ్ము రేపుతున్నది మన మల్లన్నే! మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే Read more

తెలంగాణలో బీసీ వర్గాలకు మరో డిప్యూటీ సీఎం?
రేవంత్ కేబినెట్ లో మరో డిప్యూటీ సీఎం పదవి బీసీ వర్గాలకు ఇవ్వాలనే

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీలు సంచలనంగా మారాయి. దీంతో, తాజా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశం Read more

అల్లు అర్జున్ దాడిలో సంబంధం లేదన్న కాంగ్రెస్
అల్లు అర్జున్ దాడిలో సంబంధం లేదన్న కాంగ్రెస్

హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ నివాసంలో జరిగిన విధ్వంసంతో సంబంధం లేదన్న కాంగ్రెస్ ఈ ఆదివారం సాయంత్రం జరిగిన దాడిలో, ప్రధాన నిందితుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి Read more

కేసీ వేణుగోపాల్‌ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
Bhatti's key announcement on ration cards

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో ఢిల్లీలో భేటీ అయి రాహుల్ గాంధీ కులగణనపై ఇచ్చిన హామీ అమలులో ఉన్న Read more

×