కొంప ముంచిన గూగుల్ మ్యాప్..కాలువలో పడి వ్యక్తి దుర్మరణం

కొంప ముంచిన గూగుల్ మ్యాప్..కాలువలో పడి వ్యక్తి దుర్మరణం

గూగుల్ మ్యాప్స్‌ నమ్మి ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. తన కారుతో సహా 30 అడుగుల లోతైన కాలువలో పడి దుర్మరణం చెందాడు. నోయిడాలో ఈ ఘటన వెలుచూసింది. ఆ మ్యాప్ తప్పు మార్గాన్ని చూపించి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. కానీ పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మృతుడిని ఢిల్లీలోని మండవలి నివాసి భరత్ సింగ్( 31) గా గుర్తించారు. ఆయన స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నారని వార్తా సంస్థ పిటిఐ వెల్లడించింది. ఈ సంఘటన మార్చి 1వ తేదీ శనివారం గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ P4లో జరిగిందని పోలీసులు తెలిపారు. భరత్ సింగ్ ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.

Advertisements


పోలీసులకు సమాచారం

శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో కేంద్రీయ విహార్ ప్రాంతం సమీపంలోని కాలువలో కారు పడిపోయినట్లు పోలీసులకు సమాచారం అందిందని బీటా 2 పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి విజయ్ కుమార్ తెలిపారు. భరత్ సింగ్ రాణి రాంపూర్‌లో ఒక వివాహ కార్యక్రమానికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని కుమార్ తెలిపారు. రోడ్డు చివర ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేవని, దీనివల్ల కారు నియంత్రణ కోల్పోయి కాలువలో పడి ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు.

హెచ్చరిక బోర్డులు లేవు
కారు వేగంగా వెళుతోందని, అకస్మాత్తుగా కాలువలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షి సౌరభ్ తెలిపారు. స్థానికులు సహాయం చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ కారు బోల్తా పడి నీటితో నిండిపోయింది. కాలువల దగ్గర హెచ్చరిక బోర్డులు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతుందని స్థానికులు చెబుతున్నారు. కాగా భరత్ సింగ్ గూగుల్ మ్యాప్స్ సహాయంతో నావిగేట్ చేస్తున్నప్పుడు డెడ్ ఎండ్ వద్ద ప్రమాదం జరిగి ఉండవచ్చని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Related Posts
పెళ్లి వేడుకలో చిరుత ప్రత్యక్షం- వీడియో వైరల్
పెళ్లి వేడుకలో చిరుత ప్రత్యక్షం- వీడియో వైరల్

అదో పెళ్లి వేడుక.. అతిథులతో వాతావరణం అంతా ఎంతో సందడిగా ఉంది. వధూవరులతో సహా పెళ్లికి వచ్చిన వారంతా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేస్తూ మ్యూజిక్‌ను ఎంజాయ్‌ Read more

2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే : అమిత్‌ షా ప్రకటన
Amit Shah is going to visit AP

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందేనని Read more

JD Vance :భారత్ పర్యటనకు రానున్న జేడీ వాన్స్ దంపతులు
ఎఫ్-35 యుద్ధ విమానాలు అందించేందుకు సిద్ధం: జేడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశ పర్యటన ఖరారైంది. సతీమణి ఉషా వాన్స్ తో కలిసి ఇటలీ, భారత్‌లను సందర్శించనున్నారు.అమెరికా ఉపాధ్యక్ష కార్యాలయం ఈ మేరకు ఓ Read more

UttarPradesh:ప్రియుడితో కలిసి భర్తను హత మార్చిన నవవధువు
UttaraPradesh:ప్రియుడితో కలిసి భర్తను హత మార్చిన నవవధువు

ఉత్తరప్రదేశ్‌లోని ఔరియా జిల్లాలో పెళ్లయిన రెండు వారాలకే భర్తను హత్య చేసేందుకు భార్య తన ప్రియుడితో కలిసి పన్నిన కుట్ర స్థానికంగా సంచలనం రేపింది.ఈ ఘటనపై పోలీసులు Read more

×