DMK invited...didn't go: Janasena

Janasena : డీఎంకే ఆహ్వానించింది.. వెళ్లలేదు: జనసేన

Janasena : తమిళనాడు రాజధాని చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై డీఎంకే పార్టీ అధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి పలు పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా దక్షిణాదికి చెందిన పలు పార్టీలు హాజరయ్యాయి. అయితే ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. చెన్నైలో డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలంటూ ఆహ్వానం అందిందని, కానీ హాజరుకాలేమంటూ సమాచారం ఇచ్చినట్లు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

Advertisements
 డీఎంకే ఆహ్వానించింది వెళ్లలేదు జనసేన

ఈ అంశంపై మా విధానం మాకు ఉంది

చెన్నైలో డి.ఎం.కె. పార్టీ నియోజకవర్గాల పునర్విజనపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీకి ఆహ్వానం వచ్చింది. అయితే ఈ సమావేశానికి హాజరు కాలేమని సమాచారం అందించాము. ఈ సమావేశానికి జనసేన హాజరైనట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే. ఈ సమావేశంలో పాల్గొనాలని డి.ఎం.కె. తరపున ప్రతినిధులు వచ్చి ఆహ్వానం అందించారు. వేర్వేరు కూటములుగా ఉన్నందున ఈ సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియచేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు సమాచారం ఇచ్చాము. నియోజకవర్గాల పునర్విభజనపై వారి అభిప్రాయాలు వారికి ఉన్నట్లే.. ఈ అంశంపై మా విధానం మాకు ఉంది. ఈ విషయమై మా విధానాన్ని సాధికారికమైన వేదికపై వెల్లడిస్తాం అంటూ జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Related Posts
పాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ
final match of champions tr

29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ మెగాటోర్నీకి అతిథ్యమిచ్చిన పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌ను లాహోర్‌లో నిర్వహించాలనుకున్నప్పటికీ, తాజా పరిణామాలతో ఆ Read more

వ‌రంగల్ ప‌ర్య‌ట‌న‌పై సీఎం రేవంత్ భావోద్వేగ ట్వీట్
cm revanth

సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కాసేపట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు Read more

Nithyananda : నిత్యానంద లీలలు… 20 మంది అరెస్ట్
Nithyananda నిత్యానంద లీలలు... 20 మంది అరెస్ట్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకెక్కారు. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన ఆయన, ఇప్పుడు బొలీవియాలో భూ కుంభకోణానికి పాల్పడ్డారని Read more

పురాతన మాస్టర్ పీస్‌లను ప్రదర్శించనున్న నేషనల్ ఆర్కియోలాజికల్ మ్యూజియం ఆఫ్ నేపుల్స్
National Archaeological Museum of Naples which exhibits ancient masterpieces copy

·సౌదీ అరేబియా మరియు మిడిల్ ఈస్ట్‌లో మొదటిసారిగా పాంపీ, హెర్క్యులేనియం మరియు వెలుపలి నుండి ఐకానిక్ ఇటాలియన్ కళాఖండాలు ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించబడతాయి...నవంబర్ 7 నుండి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×