ఆస్తిలో కేవ‌లం 1 శాతం లోపే త‌న పిల్ల‌ల‌కు ఇస్తాను: బిల్ గేట్స్

Bill Gates: ఆస్తిలో కేవ‌లం 1 శాతం లోపే త‌న పిల్ల‌ల‌కు ఇస్తాను: బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. త‌న పిల్ల‌ల‌కు త‌న పూర్తి ఆస్తి సంక్ర‌మించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న ఆస్తిలో కేవ‌లం 1 శాతం లోపే త‌న కుటుంబానికి ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. వారు వార‌స‌త్వంగా వ‌చ్చిన ఆస్తి ద్వారా కాకుండా పిల్ల‌లు త‌మ భ‌విష్య‌త్తును తామే నిర్మించుకోవాల‌ని, స్వ‌తంత్రంగా పైకి రావ‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఫిగ‌రింగ్ ఔట్ విత్ రాజ్ షామానితో పాడ్‌కాస్ట్‌లో బిల్ గేట్స్ పేర్కొన్నారు. వార‌సత్వ ఆస్తి కోసం వాళ్లు ఎదురుచూడవ‌ద్దు అని ఆయ‌న ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు.

Advertisements
ఆస్తిలో కేవ‌లం 1 శాతం లోపే త‌న పిల్ల‌ల‌కు ఇస్తాను: బిల్ గేట్స్

గొప్ప విలువ‌ల‌తో పెంచాను
“ఈ అంశంలో ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకోవాలి. నా పిల్ల‌ల‌కు మంచి విద్యను అందించాను. వారిని గొప్ప విలువ‌ల‌తో పెంచాను. తండ్రి కూడ‌బెట్టిన ఆస్తిపై ఆధార‌ప‌డ‌కుండా వారు సొంతంగా సంపాదించుకోగ‌ల‌ర‌నే న‌మ్మ‌కం నాకు ఉంది. నేను సంపాదించిన మొత్తంలో 1 శాతం కంటే త‌క్కువ పిల్ల‌ల‌కు ఇస్తాను.
వారు సొంతంగా ఎదిగేలా చేయాలి
ఇదేమీ వార‌స‌త్వం కాదు. మైక్రోసాఫ్ట్ విధుల‌ను నిర్వ‌ర్తించ‌మ‌ని వారిని అడ‌గ‌ను. వారు సొంతంగా సంపాదించుకోవ‌డానికి, విజ‌యం సాధించ‌డానికి అవ‌కాశం ఇవ్వాల‌ని అనుకుంటున్నాను. మ‌న ప్రేమ‌తో వారిని గంద‌ర‌గోళంలోకి నెట్టివేయ‌కూడ‌దు. వారికి క‌ల్పించే అవ‌కాశాల‌పై స్ప‌ష్ట‌త ఇచ్చి, వారు సొంతంగా ఎదిగేలా సిద్ధం చేయాలి” అని బిల్ గేట్స్ అన్నారు.
ఇక బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం… బిల్ గేట్స్ మొత్తం ఆస్తి సుమారు 155 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉంది. ఇందులో ఆయ‌న పిల్ల‌ల‌కు కేవ‌లం 1.55 బిలియన్ డాల‌ర్ల (ఒక శాతం) ఆస్తి మాత్ర‌మే ద‌క్క‌నుంది. అయితే, త‌న ఆస్తికి చెందిన ఎక్కువ శాతం విరాళాల‌కు వెళుతుంద‌ని, వార‌స‌త్వ సంక్ర‌మ‌ణ‌కు చెల్ల‌ద‌ని బిల్ గేట్స్ పేర్కొన్నారు.

READ ALSO: Telugu Associations : అమెరికాలో తెలుగు సంఘాల చందాల రగడ

Related Posts
ఇన్వెస్టర్లను భయపెడుతున్న చైనా కొత్త వైరస్
ఇన్వెస్టర్లను భయపెడుతున్న చైనా కొత్త వైరస్

దాదాపు 4 ఏళ్ల కిందట చైనా నుంచి ప్రపంచానికి విస్తరించిన కరోనా వైరస్ పెద్ద విధ్వంసాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. చైనా నగరం ఊహాన్ నుంచి ప్రపంచ Read more

జమ్ము కశ్మీర్ మిస్టరీ మరణాలకు కారణాలు: కేంద్రమంత్రి
jitendra singh

జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో అంతుచిక్కని మరణాలు సంభవిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నెలన్నర రోజుల వ్యవధిలోనే మొత్తంగా 17 మంది ప్రాణాలు Read more

Tahawwur Rana: ఢిల్లీకి చేరుకున్న తహవూర్‌ రాణా
Tahavor Rana arrives in Delhi

Tahawwur Rana : 2008 ముంబై ఉగ్రవాద దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తహవ్వూర్ రాణా అమెరికా నుంచి భారత్ కు చేరుకున్నాడు. భారత నిఘా, దర్యాప్తు Read more

రిగ్గింగ్‌ జరగలేదని ఈసీ ఎలా చెప్పగలదు : సందీప్‌ దీక్షిత్‌
sandeep dikshit

కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. ఈ సందర్బంగా ఈవీఎంల రిగ్గింగ్‌ జరగలేదని ఈసీ చేసిన ప్రకటనపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×