Bangkok Earthquake భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

Bangkok Earthquake : భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

Bangkok Earthquake : భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం నుంచి తృటిలో బయటపడి తెలంగాణ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం క్షేమంగా స్వదేశానికి చేరుకుంది. పెళ్లికి హాజరు కావాలని వెళ్లిన ఈ కుటుంబం అక్కడ భారీ భూకంపానికి గురైంది.శుక్రవారం సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో మక్కన్ సింగ్ భార్య, పిల్లలు భయానక పరిస్థితులను ఎదుర్కొన్నారు.అయితే ఎలాంటి ప్రాణనష్టం లేకుండా స్వస్థలానికి చేరుకున్నారు.థాయ్‌లాండ్, మయన్మార్ దేశాల్లో సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర నాశనాన్ని మిగిల్చాయి. వందల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా, అనేక మంది మరణించారు. జనాలు భయంతో పరుగులు పెట్టారు.

Advertisements
Bangkok Earthquake భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం
Bangkok Earthquake భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

ఈ భయానక పరిస్థితుల్లోనే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం కూడా చిక్కుకుంది.ఈ ఘటనపై ఎమ్మెల్యే భార్య మాట్లాడుతూ – “మేమంతా బ్యాంకాక్‌ లోని నొవాటెల్ హోటల్‌లో 35వ అంతస్తులో ఉన్నాం.శుక్రవారం ఉదయం భూకంపం రావడంతో భవనం ఊగిపోవడం మొదలైంది. వెంటనే నా పిల్లలతో కలిసి మెట్లు దిగి బయటకు పరుగెత్తాం.భూప్రకంపనలతో పైకప్పు ఊడిపోగా, భవనం ఒకవైపు ఒరిగిపోయింది. మేము బయటకు చేరుకునేలోపే కళ్లెదుటే పక్క భవనాలు నేలమట్టమయ్యాయి. ఆ దృశ్యాన్ని చూడగానే గుండె ఆగినంత పనయ్యింది,” అని ఆమె భావోద్వేగంగా తెలిపారు.తీవ్ర భయానక పరిస్థితుల నుంచి బయటపడి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం లభించింది. భార్య, పిల్లలను చూసి ఎమ్మెల్యే భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సంఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డ తమ కుటుంబం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts
Poilievre: కెనడా ప్రధాన మంత్రి కావాలనే లక్ష్యం తో దూసుకువెళుతున్న పొయిలీవ్రే
కెనడా ప్రధాన మంత్రి కావాలనే లక్ష్యం తో దూసుకువెళుతున్న పొయిలీవ్రే

పొయిలీవ్రే రాజకీయ మార్గంపియరీ పొయిలీవ్రే, కెనడాలో తన సుదీర్ఘ రాజకీయ కరీర్‌తో వెలుగొందిన ప్రముఖ నాయకుడు. మొదటి నుండి, అతను కన్జర్వేటివ్ పార్టీలో ఒక కీలక పాత్ర Read more

నేడు ఏపీ కేబినెట్ సమావేశం
AP Cabinet meeting today

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో కేబినేట్ సమావేశం జరుగనుంది. 3 ఉచిత సిలిండర్ల పథకంపై ఈ కేబినెట్‌లో చర్చ సాగనుంది. ముఖ్యంగా వరద ప్రభావిత Read more

అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం రేఖా
rekha gupta sleeping

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అసెంబ్లీలో నిద్రపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సభలో సభ్యులు చర్చలు జరుపుతున్న సమయంలో ఆమె కునుకు తీశారు. ఈ Read more

ప్రభల తీర్దానికి అరుదైన గుర్తింపు
prabhala tirdam

సంక్రాంతి పండుగ తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ ఉత్సవాల్లో కోనసీమ ప్రభల తీర్దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలోని Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×