Bandi sanjay protest at ashok nagar after meet group 1 aspirants

రోడ్డుపై బైఠాయించి ..బండి సంజయ్ నిరసన, గ్రూప్ 1 అభ్యర్థులకు బీజేపీ భరోసా

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టుకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. గ్రూప్ 1 అభ్యర్థుల కష్టాలకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ బాధితులు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులను ఆశ్రయించి తమకు న్యాయం జరిగేలా చేయాలని కోరారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను గ్రూప్ 1 బాధితులు కలిశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన గ్రూప్ 1 అభ్యర్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసి, తమకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 29 ఉత్వర్వులతో తీవ్రంగా నష్టపోతున్నామని అభ్యర్థులు వాపోయారు.

Advertisements

గ్రూప్ 1 అభ్యర్థులను కలిసేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అశోక్ నగర్ కు వెళ్లారు. కేంద్ర మంత్రిని అయినా నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం రోడ్డెక్కి నిరసన తెలిపారు. గ్రూప్స్ అభ్యర్థుల పరిస్కారం కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

అంతకు ముందు గ్రూప్ 1 అభ్యర్థుల పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. తాము హాస్టళ్లలో చదువుకుంటున్నా కూడా బయటకు లాక్కొచ్చి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలం అని కూడా చూడకుండా హాస్టల్ లోకి చొరబడి బట్టలు చింపేస్తున్నారని మహిళా అభ్యర్థులు కేంద్ర మంత్రికి చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఏమైనా ప్రశ్నిస్తే తమపై నక్సలైట్స్ అని, లేక ఏవైనా ముద్ర వేస్తారని చెప్పారు. రాముడి వనవాసం మాదిరిగా గ్రూప్ 1 పరీక్షల కోసం 12 ఏళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చిందని అభ్యర్థులు బండి సంజయ్ కి తమ సమస్యలు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts
Mithun Reddy: సిట్ విచార‌ణ‌కు హాజరైన మిథున్ రెడ్డి
Mithun Reddy: సిట్ విచార‌ణ‌కు హాజరైన మిథున్ రెడ్డి

లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేసిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, వైసీపీ Read more

Hyderabad: హిట్ అండ్ రన్ ప్రమాదంలో యువతికి గాయాలు
Hyderabad: హిట్ అండ్ రన్ ఘటన – యువతికి తీవ్ర గాయాలు!

హైదరాబాద్ నగరంలో మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన నిందితుడు కారు వేగంగా నడిపి ఒక యువతిని ఢీ కొట్టిన ఘటన తీవ్ర సంచలనాన్ని రేపింది. మేడ్చల్ జిల్లా Read more

తెలంగాణ మందుబాబులకు షాకింగ్ వార్త..?
liquor sales in telangana jpg

తెలంగాణ మందుబాబుల జేబులకు చిల్లు పడే వార్త. త్వరలో మద్యం ధరలు భారీగా పెంచేందుకు సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా Read more

Rahul Gandhi: రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ
Rahul Gandhi: రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ రాసిన లేఖ సామాజిక న్యాయం మరియు విద్యా సంస్థలలో కొనసాగుతున్న వివక్షపూరిత వ్యవస్థలపై లోతైన ఆలోచనకు ఆహ్వానం పలికే Read more

Advertisements
×