ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ఇటీవల ఒక రూమర్ వైరల్ అయింది.ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో న్యాయనిర్ణేతగా ఉన్న ఆయనపై కొన్ని ఆరోపణలు వెల్లువెత్తాయి.ఆ షోలో ఫోక్ డ్యాన్సర్ జాను లిరి విజేతగా నిలిచింది.ఆమెకు శేఖర్ మాస్టర్ అభినందనలు చెప్పిన తీరు చూసి, కొందరు వింతగా అనుకున్నారు.వెంటనే సోషల్ మీడియాలో రూమర్లు మొదలయ్యాయి.వారు ఇద్దరూ చాలా దగ్గరయ్యారంటూ వార్తలు చెలామణి అయ్యాయి.ఆమెకు శేఖర్ మాస్టర్ మద్దతు ఉన్నందుకే గెలిచిందంటూ” కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి.
రూమర్స్కు ఫుల్ స్టాప్ పెట్టిన శేఖర్
ఈ ప్రచారాలపై శేఖర్ మాస్టర్ సూటిగా స్పందించారు.ఆమెతో నాకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదు,అని స్పష్టంగా చెప్పారు. “న్యాయనిర్ణేతగా న్యాయంగా వ్యవహరిస్తా,” అని పేర్కొన్నారు.తన పనిలో నిజాయితీ ఉండేలా చూస్తానన్నారు.ఈ రియాలిటీ షోలకు చాలా మంది తమ కలలతో వస్తారు,” అని చెప్పారు.”వాళ్ల ప్రతిభే నా దృష్టిలో ముఖ్యం,”అని స్పష్టం చేశారు.
జాను లిరి ఎందుకు ప్రత్యేకం?
“జాను లిరి డ్యాన్స్ మిగిలినవాళ్ల కంటే బాగా చేసింది,” అని అన్నారు. అందుకే ఆమెను ప్రశంసించానన్నారు. “ప్రతిభ ఉన్నవారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తాను,” అని చెప్పారు.”ఆమె కష్టపడింది, డెజర్వ్ చేసింది. నేను ఏం చేయలేదు,” అని చెప్పారు. గతంలో కూడా తనపై ఇలాంటివే రూమర్స్ వచ్చాయన్నారాయన. “అవన్నీ పట్టించుకోను,” అని స్పష్టం చేశారు.తాను న్యాయనిర్ణేతగా ఉండగలగడం వెనుక కారణం నిజాయితీ అంటారు. “ప్రతిభే నాకు ముఖ్యం, వ్యక్తిగత సంబంధాలు కాదని” ఆయన చివరగా చెప్పారు.
Read Also : Priyadarshi : ప్రియదర్శి నటనకు ఫిదా.. స్పెషల్ గిఫ్ట్ పంపిన కపుల్ సూర్య, జ్యోతిక