జమ్మూకశ్మీర్ మళ్లీ ఉద్రిక్తతతో కలకలం రేపుతోంది.కుప్వారా జిల్లాలో ఓ సాధారణ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు.ఈ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు లోనయ్యారు.గురువారం రాత్రి 43ఏళ్ల జీహెచ్ రసూల్ మాగ్రేపై కాల్పులు జరిగాయి. ఆయన ఇంటి దరిదాపుల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు.బుల్లెట్లు పొత్తికడుపు, ఎడమ చేయి వద్ద తగిలాయి.రసూల్ ప్రస్తుతం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.పోలీసులు ఘటనాస్థలాన్ని తక్షణమే కలిసారు. అక్కడి సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు.
పహల్గాం దాడి తర్వాత అప్రమత్తమైన ఆర్మీ
ఇటీవల పహల్గాం దాడి జరిగిన నేపథ్యంలో ఆర్మీ ఇప్పటికే హై అలర్ట్ మీద ఉంది.ఈ నెల 22న ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ దాడి తర్వాత భద్రతా బలగాలు కశ్మీర్ వ్యాప్తంగా తనిఖీలు పెంచాయి.శుక్రవారం నాడు దక్షిణ కశ్మీర్లోని కుల్గాం అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు కనిపించాయి.దీంతో భద్రతా బలగాలు మిలటరీ ఆపరేషన్ ప్రారంభించాయి. సమాచారం ప్రకారం ఇద్దరు ఉగ్రవాదులను అక్కడే చిక్కించుకున్నట్టు తెలుస్తోంది.
లష్కరే తాయిబా సభ్యుల అరెస్ట్
ఇక మరోవైపు, బందిపొరా చెక్పాయింట్ వద్ద మరో సంచలన ఘటన జరిగింది.లష్కరే తాయిబా అనే పాకిస్తానీ ఉగ్రసంస్థతో సంబంధాలున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి చైనీస్ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, హ్యాండ్ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.కుప్వారాలో జరిగిన కాల్పుల వెనుక నీలినిగిన ఉద్దేశం ఇంకా అర్థం కాలేదు.పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.ప్రజలు భయాందోళనలో ఉండటంతో భద్రతా బలగాలు అక్కడ మోహరించబడ్డాయి.
Read Also : Road Accident : తండ్రి కోసం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుగోలు : కానీ కుమార్తె మృతి