పీవీ సునీల్ ను సస్పెన్షన్ చేసిన ఏపీ ప్రభుత్వం

పీవీ సునీల్ ను సస్పెన్షన్ చేసిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ ఛీఫ్ గా పనిచేసిన పీవీ సునీల్ కుమార్ ను కూటమి ప్రభుత్వం తాజాగా సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలు చేసారన్న ఆరోపణలపై క్రమశిక్షణా ఉల్లంఘన కింద ఆయన్ను సస్పెండ్ చేశారు. దీంతో డీఐజీ స్దాయి అధికారిని ఇలా సస్పెండ్ చేయడంపై మాజీ అఖిల భారత సర్వీసు అధికారుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐఏఎస్ పీవీ రమేశ్ తో పాటు పలువురు దీనిపై స్పందించారు.

Advertisements
పీవీ సునీల్ ను సస్పెన్షన్ చేసిన ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వానికి తెలియదా?

డీఐజీ కాకుండా అడ్డుకునేందుకే పీవీ సునీల్ కుమార్ ను ఇలా కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆయన సెలవు తీసుకున్నప్పుడు ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఆయనేమీ మీలా డిప్లమోటిక్ పాస్ పోర్టుతో ప్రజల డబ్బుతో విదేశాలకు వెళ్లలేదు కదా అని విమర్శలు గుప్పించారు. ఈ రూల్ మిగతా వారికి కూడా అమలు చేస్తే సగం మంది సస్పెండ్ అవుతారన్నారు. అక్కడితే ఆగకుండా చంద్రబాబు, లోకేష్ దావోస్ టూర్ పైనా ప్రవీణ్ కుమార్ ప్రశ్నలు గుప్పించారు.
సునీల్ అరెస్టుపై ఐఏఎస్ పీవీ రమేశ్ స్పందన
మరోవైపు ఏపీలో మాజీ సీనియర్ ఐఏఎస్ పీవీ రమేశ్ మాత్రం పీవీ సునీల్ సస్పెండ్ పై భిన్నంగా స్పందించారు. నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే అధికారులను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు. అటువంటి నేరాలకు పాల్పడే అధికారులను తగిన ప్రక్రియ తర్వాత సర్వీసు నుండి తొలగించాలన్నారు. తన సొంత భార్యపై తీవ్రమైన నేరాలు చేసిన ఐపీఎస్ అధికారిపై సెషన్స్ కోర్టులో విచారణ జరుగుతోందని, రాజకీయ ప్రోత్సాహం కారణంగా ఆయన పదవిలో కొనసాగారని గుర్తుచేశారు. కులం పేరుతో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించే అటువంటి వ్యక్తులను అందరూ ఖండించాలన్నారు. మతం, కులం, ప్రాంతం ఏదైనా నేరస్థుడు నేరస్థుడే అన్నారు.

Related Posts
ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనితో, ఏపీకి ఐదు, తెలంగాణకు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు Read more

రేపు సాయంత్రం నుంచి జనసేన ఆవిర్భావ సభ
రేపు సాయంత్రం నుంచి జనసేన ఆవిర్భావ సభ

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ రేపు (శుక్రవారం) సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభం కానుందని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ Read more

పవనే ఇక రాష్ట్రానికి దిక్కు: ఉండవల్లి కామెంట్
పవనే ఇక రాష్ట్రానికి దిక్కు: ఉండవల్లి కామెంట్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిమానం చాటుకున్నారు. గతంలో ఓసారి పవన్ కళ్యాణ్ పిలిస్తే Read more

నేడు “సీ ప్లేన్‌”ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu

విజయవాడ: నేడు సీఎం చంద్రబాబు , కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు , ఇతర అధికారులు కలిసి విజయవాడ - శ్రీశైలం మధ్య Read more

       
×