Signboards :ఉర్దూ భాషకు అనుమతి: సుప్రీంకోర్టు తీర్పు

Signboards :ఉర్దూ భాషకు అనుమతి: సుప్రీంకోర్టు తీర్పు

సైన్బోర్డులపై ఉర్దూ భాష వాడకాన్ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహారాష్ట్రలోని పాటూరు మున్సిపల్ కౌన్సిల్ సైన్ బోర్డును ఉర్దూ భాషలో రాసిన విషయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును జస్టిస్ సుధాను దూలియా, జస్టిస్ కె. వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారించింది. వారు ఇచ్చిన తీర్పులో ఉర్దూ భాషకు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం మరాఠీతో సమాన హోదా ఉందని స్పష్టం చేశారు.సైన్బోర్డులపై ఉర్దూ భాష వాడకాన్ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహారాష్ట్రలోని పాటూరు మున్సిపల్ కౌన్సిల్ సైన్ బోర్డును ఉర్దూ భాషలో రాసిన విషయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును జస్టిస్ సుధాను దూలియా, జస్టిస్ కె. వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారించింది. వారు ఇచ్చిన తీర్పులో ఉర్దూ భాషకు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం మరాఠీతో సమాన హోదా ఉందని స్పష్టం చేశారు.

Advertisements
  Signboards :ఉర్దూ భాషకు అనుమతి: సుప్రీంకోర్టు తీర్పు
Signboards :ఉర్దూ భాషకు అనుమతి: సుప్రీంకోర్టు తీర్పు

సైన్బోర్డుల్లో ఉర్దూ వాడకంపై సుప్రీం కోర్టు తీర్పు

కోర్టు పేర్కొన్న ప్రకారం, బ్రిటీష్ పాలన కాలంలో మతాల ఆధారంగా భాషలను విభజించారని, హిందువులకు హిందీ, ముస్లింలకు ఉర్దూ భాష అని పిలవడం ప్రారంభమయ్యిందని చెప్పింది. అయితే హిందీ, ఉర్దూ రెండూ ఒకే మూలాలను కలిగి ఉన్న ఇండో-ఆర్యన్ భాషలు అని ధర్మాసనం అభిప్రాయపడింది. హిందీ భాష ఎక్కువగా సంస్కృతం ఆధారంగా అభివృద్ధి చెందగా, ఉర్దూ పర్షియన్ మూలాలతో ఎదిగిందని తెలిపింది. అయినప్పటికీ, ఈ రెండు భాషలూ భారత భూమిలోనే పుట్టి, పెరిగినవని న్యాయస్థానం స్పష్టం చేసింది.మహారాష్ట్ర లోకల్ అథారిటీ లాంగ్వేజ్ యాక్ట్, 2022 ప్రకారం ఉర్దూ భాష నిషేధితమా అనే అంశంపై కోర్టు స్పందిస్తూ, అలాంటిదేమీ లేనని, ఆ చట్టం ఉర్దూ వాడకాన్ని నిషేధించదని తేల్చి చెప్పింది. పైగా, భారత రాజ్యాంగం అందించిన భాషలలో ఉర్దూ ఒకటే అయినందున, దానిపై వివక్ష చూపడం సబబు కాదని పేర్కొంది. అంతేకాకుండా, ఉర్దూ భాషను ఒక మతానికి మాత్రమే పరిమితం చేయడం తప్పని, ఈ భాషకు దేశంలో బలమైన సంస్కృతి, సాహిత్య నేపథ్యం ఉందని వెల్లడించింది.

Read More : Israel: గాజాలో ఇజ్రాయెల్ దాడిలో 23 మంది మృతి

Related Posts
IPL 2025: ధోనీతో అంత ఈజీ కాదు:రోహిత్ శర్మ
IPL 2025: ధోనీతో అంత ఈజీ కాదు:రోహిత్ శర్మ

ఐపీఎల్ 2025 సీజన్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది.లీగ్ చరిత్రలో చెరో ఐదు సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన Read more

భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు: హైకోర్టు
భార్య మరో వ్యక్తిని ప్రేమించడం అక్రమ సంబంధం కాదు: హైకోర్టు

భర్త కాకుండా మరో వ్యక్తితో భార్య శారీరక సంబంధం పెట్టుకోకుండా ప్రేమ, అనురాగం ఉంటే దానిని అక్రమం సంబంధంగా పరిగణించలేమని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Read more

Pakistan Army’s convoy: పాక్ సైనికులపై బీఎల్ఏ దాడి..వీడియో విడుదల
పాక్ సైనికులపై బీఎల్ఏ దాడి..వీడియో విడుదల

పాకిస్థాన్ పారామిలటరీ బలగాల వాహన శ్రేణిపై బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు ఆదివారం ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్ల జరిపిన ఈ Read more

Pakistan Azerbaijan Turkey: భారత్‌కు ముప్పుగా మారిన “త్రీ బ్రదర్స్” కూటమి
Pakistan Azerbaijan Turkey: భారత్‌కు ముప్పుగా మారిన "త్రీ బ్రదర్స్" కూటమి

భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్, టర్కీ, అజర్‌బైజాన్ (Pakistan Azerbaijan Turkey) కలిసి ఏర్పరచుకున్న అనధికారిక సైనిక-రాజకీయ కూటమి ఇది. మూడు దేశాలు ఇస్లామిక్ బ్యాక్‌గ్రౌండ్, సైనిక సహకారం, Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×