సైన్బోర్డులపై ఉర్దూ భాష వాడకాన్ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహారాష్ట్రలోని పాటూరు మున్సిపల్ కౌన్సిల్ సైన్ బోర్డును ఉర్దూ భాషలో రాసిన విషయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును జస్టిస్ సుధాను దూలియా, జస్టిస్ కె. వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారించింది. వారు ఇచ్చిన తీర్పులో ఉర్దూ భాషకు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం మరాఠీతో సమాన హోదా ఉందని స్పష్టం చేశారు.సైన్బోర్డులపై ఉర్దూ భాష వాడకాన్ని సమర్థిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహారాష్ట్రలోని పాటూరు మున్సిపల్ కౌన్సిల్ సైన్ బోర్డును ఉర్దూ భాషలో రాసిన విషయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును జస్టిస్ సుధాను దూలియా, జస్టిస్ కె. వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారించింది. వారు ఇచ్చిన తీర్పులో ఉర్దూ భాషకు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం మరాఠీతో సమాన హోదా ఉందని స్పష్టం చేశారు.

సైన్బోర్డుల్లో ఉర్దూ వాడకంపై సుప్రీం కోర్టు తీర్పు
కోర్టు పేర్కొన్న ప్రకారం, బ్రిటీష్ పాలన కాలంలో మతాల ఆధారంగా భాషలను విభజించారని, హిందువులకు హిందీ, ముస్లింలకు ఉర్దూ భాష అని పిలవడం ప్రారంభమయ్యిందని చెప్పింది. అయితే హిందీ, ఉర్దూ రెండూ ఒకే మూలాలను కలిగి ఉన్న ఇండో-ఆర్యన్ భాషలు అని ధర్మాసనం అభిప్రాయపడింది. హిందీ భాష ఎక్కువగా సంస్కృతం ఆధారంగా అభివృద్ధి చెందగా, ఉర్దూ పర్షియన్ మూలాలతో ఎదిగిందని తెలిపింది. అయినప్పటికీ, ఈ రెండు భాషలూ భారత భూమిలోనే పుట్టి, పెరిగినవని న్యాయస్థానం స్పష్టం చేసింది.మహారాష్ట్ర లోకల్ అథారిటీ లాంగ్వేజ్ యాక్ట్, 2022 ప్రకారం ఉర్దూ భాష నిషేధితమా అనే అంశంపై కోర్టు స్పందిస్తూ, అలాంటిదేమీ లేనని, ఆ చట్టం ఉర్దూ వాడకాన్ని నిషేధించదని తేల్చి చెప్పింది. పైగా, భారత రాజ్యాంగం అందించిన భాషలలో ఉర్దూ ఒకటే అయినందున, దానిపై వివక్ష చూపడం సబబు కాదని పేర్కొంది. అంతేకాకుండా, ఉర్దూ భాషను ఒక మతానికి మాత్రమే పరిమితం చేయడం తప్పని, ఈ భాషకు దేశంలో బలమైన సంస్కృతి, సాహిత్య నేపథ్యం ఉందని వెల్లడించింది.
Read More : Israel: గాజాలో ఇజ్రాయెల్ దాడిలో 23 మంది మృతి