Akbaruddin : విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం : అక్బరుద్దీన్ ఆగ్రహం తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో అమలైన “మన ఊరు – మన బడి” కార్యక్రమంపై AIMIM శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ పథకాన్ని అతిపెద్ద స్కామ్గా అభివర్ణిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అతి పెద్ద కుంభకోణమని, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం – అక్బరుద్దీన్ ఆగ్రహం.రాష్ట్రంలో విద్యా పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నాయని అన్నారు.

4,823 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు
2,000కి పైగా బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తగిన నిధులు కేటాయించకుండా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనడం ఎంతవరకు న్యాయమో ప్రభుత్వమే చెప్పాలన్నారు
మన ఊరు – మన బడి పై గట్టిగా నిలదీయాలి
ఈ పథకం కింద జరిగిన అవకతవకలను ప్రజలు గమనించాలి
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, దీనిపై సీరియస్గా దర్యాప్తు చేపట్టాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
మన ఊరు – మన బడి లో జరిగిన అవకతవకలు వెలుగులోకి వస్తాయా?
ప్రభుత్వం నిజమైన దర్యాప్తు చేపడితే, నిజాలు బయటపడతాయన్నారు
బీఆర్ఎస్ పాలనలో విద్యా రంగానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలు గమనించాలని కోరారు
ప్రభుత్వ పాఠశాలలకు తగిన నిధులు మంజూరు చేసి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.