రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ తాజా ఆదేశాలు

RBI: రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ తాజా ఆదేశాలు

చిన్న రుణ మొత్తాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నిర్ణయాలను తీసుకుంది. 50,000 రూపాయల వరకు ఉండే చిన్న రుణ మొత్తాలపై అధిక ఛార్జీలను విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రాధాన్యత రంగాలు- ప్రత్యేకించి చిన్న మొత్తాల రుణాలపై దీన్ని వర్తింపజేసింది.
చిన్న మొత్తాల రుణగ్రహీతల హక్కులను పరిరక్షించడం..
50,000 రూపాయల వరకు ఉన్న ప్రాధాన్యత రంగ రుణాలకు సంబంధించిన లేదా తాత్కాలిక సేవా ఛార్జీలు గానీ,ఇతర తనిఖీ ఛార్జీలు విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థిక భారం నుండి చిన్న మొత్తాల రుణగ్రహీతల హక్కులను పరిరక్షించడం, ఈ పాలసీని మరింత సరళీకరించడంలో భాగంగా ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

Advertisements
రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ తాజా ఆదేశాలు

ఏప్రిల్ 1వ తేదీ అమలులోకి వస్తాయి
50 వేల రూపాయల వరకు ఉన్న ప్రాధాన్యత రంగ రుణాలపై ఎలాంటి లోన్-సంబంధిత తాత్కాలిక సేవ ఛార్జీలు/తనిఖీ ఛార్జీలు ఇకపై ఉండబోవని తెలిపింది. తాజా ఆదేశాలు- ఏప్రిల్ 1వ తేదీ నుంచి అంటే.. 2025- 2026 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి అమలులోకి వస్తాయి. ప్రాధాన్యత రంగ రుణాల కింద బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుండి తీసుకున్న బంగారు ఆభరణాలకు ఈ ఉత్తర్వులు వర్తించవు. వాటిని మినహాయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వ్యాపార కార్యకలాపాల కోసం 50,000 రూపాయల వరకు తీసుకునే వాళ్లు, రైతులు, బడుగు-బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం అందజేయడాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించినట్లు వివరించింది.
ఈ గైడ్‌లైన్స్ ప్రకారం..
ఈ కొత్త పీఎస్‌ఎల్ మార్గదర్శకాల వల్ల బ్యాంకుల జావాబుదారీతనం మరింత మెరుగుపడుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం- ఒక ఆర్థిక సంవత్సరం త్రైమాసికం ముగిసిన 15 రోజుల్లో, ఆర్థిక సంవత్సరం ముగిసిన నెల రోజుల్లోగా ఈ పీఎస్ఎల్ రుణాలకు సంబంధించిన సమగ్ర డేటాను ఆర్బీఐకి అందజేయాల్సి ఉంటుంది. .

Related Posts
New Aadhar App: కొత్త ఆధార్ యాప్ తెచ్చిన కేంద్రం
కొత్త ఆధార్ యాప్ తెచ్చిన కేంద్రం

ఆధార్ సేవల్ని వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేంద్రం.. ఇందులో భాగంగా ఇవాళ మరో కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉన్న Read more

ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు మద్రాసు హైకోర్టు ప్రశ్న
Madras High Court question to spiritual guru Jaggi Vasudev

Madras High Court question to spiritual guru Jaggi Vasudev న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఇషా ఫౌండేషన్‌పై మద్రాసు హైకోర్టు సీరియస్ Read more

జార్ఖండ్ బైపోల్ ఎన్నికలు: ఆర్జేడీ 5 సీట్లలో ఆధిక్యం సాధించింది..
RJD

2024 జార్ఖండ్ అసెంబ్లీ బైపోల్ ఎన్నికల ఫలితాల్లో, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆకట్టుకుంటూ ఐదు సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఈ రోజు వోట్ల లెక్కింపు ప్రకారం, Read more

మన్మోహన్‌ సింగ్‌ పార్థివదేహానికి ప్రధాని నివాళులు
PM Modi pays tribute to Manmohan Singh

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, ప్రముఖ‌ ఆర్థిక‌వేత్త మ‌న్మోహ‌న్ సింగ్ గురువారం క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్థివదేహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళులర్పించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×