KA Paul: చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్

KA Paul: చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు రూ. 5 వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సంబంధిత శాఖలు విడుదల చేయడంతో, ఈ ప్రకటన రాజకీయంగా తీవ్ర ప్రతిస్పందన కలిగిస్తోంది.

Advertisements

కేఏ పాల్ ప్రశ్నలు

ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కఠినంగా స్పందించారు. ఆయన ప్రకటన ప్రకారం, ఇన్నాళ్లూ పాస్టర్లకు గౌరవ వేతనం ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు గుడ్ ఫ్రైడే సందర్భంగా మాత్రమే ఈ ప్రకటన చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలేనా? అని సూటిగా ప్రశ్నించారు. ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనా అని ఆయన అభిప్రాయపడ్డారు.

పాస్టర్ ప్రవీణ్ హత్య

పాస్టర్ ప్రవీణ్‌ హత్య ఘటనతో రాష్ట్రంలోని క్రైస్తవ, ముస్లిం, హిందూ సమాజాల్లో చర్చలు ముదిరిన నేపథ్యంలో, ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనం ప్రకటించడాన్ని కేఏ పాల్ విమర్శించారు. ఈ వేతనాల ద్వారా పాస్టర్ల నోరు మూయించాలనే ఆలోచన ఏమిటి? అని ప్రశ్నించారు. ప్రజల్లో కలుగుతున్న ఆందోళనను అదుపు చేయాలన్నదే లక్ష్యమా అని వ్యాఖ్యానించారు. కేఏ పాల్ వేసిన మరొక కీలకమైన ప్రశ్న – మిగిలిన 80 వేల మంది పాస్టర్ల పరిస్థితి ఏమిటి? వారిని ఎందుకు విస్మరించారు? అన్నది. అలాగే, రాష్ట్రంలో ఉన్న ముస్లిం మౌలానాలు, హిందూ అర్చకులు, ఇతర మతపెద్దల పరిస్థితిని గురించి కూడా పాల్ నిలదీశారు. అందరికీ సమానత్వం అనే నినాదం రాజ్యాంగంలో ఉంది. కానీ ఆచరణలో ప్రభుత్వానికి వైఖరి వేరుగా కనిపిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు స్థితిగతులపై కూడా పాల్ విమర్శలు గుప్పించారు. హిందువులను క్రైస్తవులుగా మారుస్తున్నారని గతంలో చంద్రబాబు అన్నారని ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా అదే మాట మాట్లాడారని పాల్ మండిపడ్డారు. ఒక లక్ష రూపాయలు కూడా లేని వ్యక్తి లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారతాడు? ఆస్తులు ఎలా పెరిగాయి? ఎవరి ఖర్చుతో ఈ సంపద?” అని ప్రశ్నించారు. ప్రజలు ఈ విషయాలను ఆలోచించాలన్నారు. దైవ జనులారా మనం ఎవరూ మోసపోకూడదని పాల్ అన్నారు. లక్ష రూపాయలు కూడా లేని వ్యక్తి లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మనం అమ్ముడు పోకూడదని అన్నారు. అందరం కలిసి పోరాడి మన పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

Read also: Road Accident: కర్ణాటకలో రోడ్డుప్రమాదం..నలుగురు ఏపీ వాసుల మృతి

Related Posts
ప్రధాని మోడీతో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా భేటీ
Delhi CM Rekha Gupta meet Prime Minister Modi

రేఖా గుప్తాకు ప్రధాని మోడీ పలు సలహాలు, సూచనలు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా శనివారం ఉదయం కలిశారు. కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు Read more

శీతాకాలంలో జమ్మూ కాశ్మీర్: గుల్మర్గ్, సోనమర్గ్, పహల్గామ్‌లో తొలి మంచు
gulmarg

ఈ ఏడాది శీతాకాలం మొదలవడంతో జమ్ము కాశ్మీర్‌లోని ప్రసిద్ధమైన గుల్మర్గ్, సోనమర్గ్, పహల్గామ్ వంటి ప్రాంతాలలో మొదటి మంచు కురిసింది. ఈ మంచు కురిసిన వాతావరణం స్థానికుల Read more

International Airport : అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుల 10 జాబితా విడుదల
International Airport అత్యంత రద్దీ ఎయిర్ పోర్టుల 10 జాబితా విడుదల

విమానయాన రంగంలో కొత్త రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి. కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత, ప్రయాణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యధిక Read more

Nara Lokesh:టెన్త్, ఇంటర్‌ ఫలితాలు మొబైల్ లోనే చూసుకోవచ్చు :నారా లోకేశ్‌
Nara Lokesh:టెన్త్, ఇంటర్‌ ఫలితాలు మొబైల్ లోనే చూసుకోవచ్చు :నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం "మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0" వెర్షన్‌ను మరిన్ని సేవలకు అనుసంధానించనున్నట్లు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శాసనసభలో వెల్లడించారు. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×