jagan vijaysaireddy ycp

విశ్వసనీయత అనేది ముఖ్యం: జగన్

వైకాపాను వీడిన రాజ్యసభ ఎంపీ లపై ఆ పార్టీ అధ్యక్షడు జగన్ స్పందించారు.వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై సీఎం జగన్ ఈరోజు స్పందిస్తూ బయటకు వెళ్లే ప్రతి రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలని జగన్ అన్నారు. ప్రలోభాలకు లొంగో, భయపడో లేదా రాజీపడో వెళ్లిపోతే ఎలాగని ప్రశ్నించారు.ఇంకా ఒకరో ఆరో వెళ్లిపోయేవాళ్ళుంటే వాళ్ళకైనా అంతేనని వాఖ్యానించారు. రాజకీయాల్లో కష్టాలు ఉంటాయని ఐదేళ్లు కష్టపడితే మన సమయం వస్తుందని అన్నారు. విజయసాయిరెడ్డికైనా, మరెవరికైనా విశ్వసనీయత ముఖ్యమని చెప్పారు.

1400942 ys jagan mohan reddy

వైకాపా నేడు ఇలా ఉందంటే అది నాయకుల వల్ల కాదని చెప్పారు.అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని జగన్ అన్నారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే విషయంలో కోర్టుకు కూడా వెళ్లామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరుపై వాళ్లు ఏం చేసుకున్నా వాళ్ల ఇష్టమని అన్నారు. ఎదురెదురుగా ఉండి కొట్టుకోవడం ఎందుకని అన్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంపై కోర్టుకు అసెంబ్లీ స్పీకర్ సమాధానం చెప్పాలని డిమండ్ చేశారు. లిక్కర్ వ్యవహారంతో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? అని జగన్ ప్రశ్నించారు. మిథున్ తండ్రి పెద్దిరెడ్డి ఏ శాఖకు మంత్రి? ఆయనకు లిక్కర్ కు ఏం సంబంధమని అడిగారు. ఎవరినో ఒకరిని ఇరికించడం, కేసు పెట్టడం వాళ్లకు అలవాటేనని విమర్శించారు.

Related Posts
Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో శ్రీవారిని ద‌ర్శించుకున్న‌చంద్రబాబు
Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో శ్రీవారిని ద‌ర్శించుకున్న‌చంద్రబాబు

తిరుమల స్వామివారి సేవలో చంద్రబాబు కుటుంబం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల Read more

పవన్ జయకేతనం సభకు భారీ ఏర్పాట్లు
పవన్ జయకేతనం సభ: భారీ ఏర్పాట్లు, కొత్త రోడ్ మ్యాప్ ఏంటో?

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయిన నేపథ్యంలో, పార్టీల మధ్య అంతర్గత వ్యూహాలు మారుతున్నాయి. అధికారంలో ఉన్న Read more

విజయసాయిరెడ్డి కి కౌంటర్ ఇచ్చిన షర్మిల
Vijayasai sharmila

వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల వివాదం గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరియు వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విజయసాయిరెడ్డి ఇటీవల తన వ్యాఖ్యల్లో ఇది Read more

సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ
CPI Ramakrishna letter to CM Chandrababu

అమరావతి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ సీఎంకి లేఖ రాశారు. 2024-25లో ఏపీకి కేంద్రం నుంచి విడుదలైన నిధుల వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని Read more