immigrants from usa

అమెరికా కలల కోసం కోట్లు ఖర్చు!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరుస్తున్నారు . హామీలలోని భాగంగా అమెరికా నుండి భారత్ కు బుధవారం మధ్యాహ్నం వచ్చిన వలసదారుల్లో 33 చొప్పున గుజరాత్, హర్యానావాసులు ఉండగా.. తర్వాత 30 మంది పంజాబ్‌కు చెందినవారే అధికంగా ఉన్నారు. ముగ్గురు మహారాష్ట్ర, ఇద్దరేసి ఛండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్‌లకు చెందినవారు. ఇక, 25 మహిళలు, 12 మంది చిన్నారులు వీరిలో ఉండగా.. నాలుగేళ్లు బాలుడు ఒకరు. అలాగే,, 48 మంది 25 ఏళ్లలోపువారే కాగా.. ఈ విమానంలో 11 మంది క్రూ సిబ్బంది, 45 మంది అమెరికా అధికారులు కూడా ఉన్నారు.అమెరికా సైనిక విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్‌లో వీరిని తరలించారు.అమెరికాలో అక్రమంగా నివసిస్తోన్న భారతీయుల తరలింపులో భాగంగా తొలి విడతలో 104 మంది బృందం బుధవారం మధ్యాహ్నం అమృత్‌సర్‌కు చేరుకుంది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్ మాట్లాడుతూ.. తమను చిత్రహింసలకు గురిచేశారని, కాళ్లకు సంకెళ్లు వేసి తీసుకొచ్చారని ఆరోపించారు. అమృత్‌సర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత వాటిని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

us immigrants 4c9a8390 23a0 11ea 8c10 7db3e225203f 1738624461203

బుధవారం రాత్రి స్వగ్రామానికి చేరుకున్న జస్పాల్‌.. ట్రావెల్ ఏజెంట్ చట్టపరమైన మార్గాల ద్వారా అమెరికాకు పంపిస్తానని చెప్పి మోసం చేశాడని తెలిపారు. సరైన వీసాతో పంపమని తాను ఏజెంట్‌ను కోరితే.. అతడు ద్రోహం చేశాడన్నారు. రూ. 33 లక్షలకు డీల్ కుదుర్చుకుని మోసపోయానని జస్పాల్ వాపోయాడు.గత ఏడాది జూలైలో భారత్ నుంచి విమానంలో బ్రెజిల్ చేరుకున్న తనకు… అమెరికా పర్యటన కూడా విమానంలోనే ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ, ఏజెంట్ మోసం చేసి అక్రమంగా అమెరికా సరిహద్దులు దాటించారని ఆరోపించారు.

Related Posts
మోక్షజ్ఞ న్యూ లుక్..ఏమన్నా ఉన్నాడా..!!
moksha nandamuri new look

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా అదిగో..ఇదిగో అనడమే తప్ప మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగకపోవడం Read more

రేవంత్ ఇలాకాలో కేటీఆర్ సవాల్
KTR SAVAL

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టింది. నారాయణపేట జిల్లా కోస్గిలో నిర్వహించిన ఈ దీక్షలో Read more

అమిత్ షా పై షర్మిల ఫైర్
అమిత్ షా పై షర్మిల ఫైర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రమైన విమర్శలు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు జవాబుదారీతనం లేదని ఆరోపించిన షర్మిల, Read more

sunita williams: భూమి మిమ్మల్ని మిస్ అయింది..తిరిగి స్వాగతం: మోడీ
భూమి మిమ్మల్ని మిస్ అయింది..తిరిగి స్వాగతం: మోడీ

2024 జూన్ 5న వారం రోజుల అంతరిక్షయానానికి వెళ్లిన సునీతా విలియమ్స్‌ అండ్‌ విల్మోర్‌లు.. సాంకేతిక సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఎలాన్‌ మస్క్‌కి చెందిన స్పేస్‌-ఎక్స్‌తో Read more