ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యిన మలయాళ బ్యూటీ మమిత బైజు, ఇప్పుడు మరో క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. “డియర్ కృష్ణ” అనే ఈ చిత్రం ఆమె కెరీర్ లో కీలకమైన సినిమా కావడం ఖాయం.ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా, ఐశ్వర్య మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.”డియర్ కృష్ణ” జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ట్రైలర్ విడుదల జరిగింది.

ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ఈ ట్రైలర్ ను విడుదల చేసి, సినిమా బృందానికి మంచి అంకితభావంతో అభినందనలు తెలిపారు.”ప్రేమలు” ఫేమ్ మమిత బైజు ఈ చిత్రంలో హీరోయిన్గా నటించడం ఈ సినిమాపై పెద్ద అంచనాలు ఏర్పరచింది. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “ఈ ట్రైలర్ చాలా బాగుంది. మమిత బైజు చక్కగా నటించారు. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది” అన్నారు.ఈ వేడుకలో చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన ప్రకటన చేసింది. సినిమా టికెట్ బుక్ చేసుకున్న వారికి అదృష్టం పలుకుతూ, 100 టికెట్ల బుకింగ్లో ఒకటి ఎంచుకొని, ఆ టికెట్ దారుడికి రూ. 10,000 క్యాష్ బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ ప్రక్రియను ఒక వారం పాటు కొనసాగించనున్నారు.”డియర్ కృష్ణ” సినిమా కథ శ్రీకృష్ణుడి మరియు ఆయన భక్తుని మధ్య జరిగిన ఒక అద్భుత సంఘటనను ఆధారం చేసుకుని రూపొందించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందంటున్నారు. సినిమాకు సంగీతం అందించిన హరి ప్రసాద్ మాట్లాడుతూ, “ఈ చిత్రం సంగీతం ప్రేక్షకులను అలరిస్తుందని అనిపిస్తుంది. ప్రతి పాట సినిమా అభినయానికి అనుగుణంగా రూపొందించబడింది” అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా, గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.