dil raju

తప్పుగా అనుకోవద్దు: దిల్ రాజు

తెలంగాణ దావత్ నేను మిస్సవుతున్నాను. సంక్రాంతికి వస్తున్న ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక దావత్ చేసుకోవాలని ఉంది అని చెప్పటం నా ఉద్దేశం’’ అని దిల్ రాజు అన్నారు. ‘‘సంక్రాంతి పండుగకు ఆంధ్రాలా తెలంగాణలో వైబ్ ఉండదు. తెల్ల కల్లు, మటన్ మాంసం మీద వైబ్స్ ఉంటాయి’’ అంటూ దిల్ రాజు చేసిన వ్యాఖ్యల విషయం తెలిసిందే. దీంతో దిల్ రాజు తెలంగాణ వాళ్లను అవమానించేలా మాట్లాడారంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలపై దిల్‌రాజు స్పందిస్తూ.. శనివారం వీడియోను విడుదల చేశారు.

Advertisements

‘‘మన సంస్కృతిలో ఉండే దావత్ గురించి, మటన్, తెల్ల కల్లు గురించి మాట్లాడాను. ఆ మాటల్లో తెలంగాణ వాళ్లను అవమానించానని, అవహేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్లు చేసి, సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది.
హీరో వెంకటేష్ నటించిన ‘‘సంక్రాంతికి వస్తున్నాం’’ సినిమా ఈవెంట్‌లో భాగంగా ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మన సంస్కృతిని నేను అభిమానిస్తా. అది అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది.

‘‘నా మాటలు తప్పుగా అర్థం చేసుకుని ఉంటే క్షమించండి. మనోభావాలు దెబ్బతిన్నాయని అనుకుంటున్న వారికి నా క్షమాపణలు.. సినిమా రంగంలో కిందిస్థాయి నుంచి ఎఫ్ఎసీ ఛైర్మన్‌గా ఎదిగాను. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు ప్రభుత్వానికీ మధ్యలో ఉంటూ పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నా.

తెలంగాణలో తెలుగు సినిమా అభివృద్ధి చెందడంతో పాటు, యువతకు ఉపయోగపడేలా పనిచేస్తా. .ఇలాంటి అనవసర విషయాల్లోకి నన్ను లాగొద్దని తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా‌’’ అంటూ దిల్‌రాజు వీడియోలో చెప్పుకొచ్చారు.

Related Posts
ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం రేవంత్‌ రెడ్డి
33 percent reservation for women in elections.. CM Revanth Reddy

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ.550 కోట్ల విలువైన నూతన భవన నిర్మాణాలు, Read more

జాతిపిత మహాత్మ గాంధీకి వర్దంతి సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ నివాళి
damodharragandhivardanthi

జాతిపిత మహాత్మగాంధీకి, ఆయన వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు.. మహాత్ముడు చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను అందరూ Read more

మీర్‌పేట్ మాధవి మర్డర్ కేసులో ట్విస్ట్
Meerpet Madhavi Murder Case

హైదరాబాద్ మీర్‌పేట వెంకటమాధవి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సంక్రాంతి రోజు తన భార్య మాధవిని రిటైర్డ్ జవాన్ గురుమార్తి దారుణంగా హత్య Read more

కుల గణన చిచ్చు..రేవంత్ సర్కార్ పై.. బీసీ సంఘాల ఫైర్!
కుల గణన చిచ్చు రేవంత్ సర్కార్ పై.. బీసీ సంఘాల ఫైర్!

2014లో జరిగిన సమగ్ర సర్వేలో OC (ఆప్తి కేటగిరీ) జనాభా 11% ఉండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఆ సంఖ్య 15.79%కి పెరిగింది.ఇదే సమయంలో Read more

Advertisements
×