adani news

అదానీపై US కోర్టు కేసులో ఊహించని ట్విస్ట్

అదానీపై అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు కేసులో మరో టర్న్. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్పై US DOJ లంచం, అవినీతి అభియోగాలు నమోదే చేయలేదని అదానీ గ్రూప్ తెలిపింది. ఫారిన్ కరప్షన్, లంచాలపై భారత్, అమెరికా మీడియా చేస్తున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేసింది. మొత్తం 5 అభియోగాల్లో వారిపై మూడే నమోదయ్యాయని తెలిపింది. సెక్యూరిటీస్ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర, సెక్యూరిటీ ఫ్రాడ్ ఆరోపణలే ఉన్నాయనడం ఇప్పుడు దేశ వ్యపథంగా మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇండియాలోనే ధనవంతుల జాబితాలో అదానీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అలాంటి అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఏకంగా అమెరికా నుంచి అరెస్ట్ వారెంట్ నోటీసులు సైతం రావడం అందర్నీ షాక్ లో పడేశాయి.

Advertisements

20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల భారతదేశపు అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం అమెరికాలోని ఇన్వెస్టర్లు, వరల్డ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి భారీగా నిధులు సేకరించాలని ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఆ కాంట్రక్ట్‌ను దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు దాదాపు రూ.2,100 కోట్ల లంచాలు చెల్లించినట్లు అమెరికాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సీపీఏ) కింద అమెరికా ఇన్వెస్టర్లను అదానీ మోసం చేసినట్లు అభియోగాలు వచ్చాయి. కాగా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా అమెరికన్ సోలార్ ప్రొడక్షన్ కంపెనీలతో టైఅప్ అయి ఇండియాలో 20 ఏళ్ల వరకు సౌరశక్తి ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ కాంట్రక్ట్ తనకే దక్కాలని అదానీ దాదాపు 2,100 కోట్లు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చాడని ఫారెన్ ఇన్వెస్టర్లు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే అమెరికా కోర్టులో ఏం జరిగిందో పరిశోధించింది. ఇందులో గౌతం అదానీపై నమోదైన నేర అభియోగాలతో పాటు అరెస్టు వారెంట్ ను గత నెలలోనే కోర్టు రద్దు చేసినట్లు తెలిసింది. అక్టోబర్ 31న వాటిని రద్దు చేయాలని న్యాయమూర్తి రాబర్ట్ ఎమ్ లెవీ ఆదేశించారని ఇండియా టుడే పేర్కొంది. విదేశీ చట్ట అమలు సంస్థలకు కేసు పత్రాలను అందించడానికి నేరారోపణ, అరెస్టు వారెంట్‌ను నిలిపేశారని తెలుస్తోంది. వాస్తవానికి అమెరికా చట్టాల ప్రకారం నిందితులు స్వచ్ఛందంగా కోర్టుకు హాజరవుతారనే బలమైన అంచనా లేకపోతే కోర్టులు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తాయి.కానీ ఇక్కడ అలాంటి పరిస్ధితి లేదని యూఎస్ అటార్నీ జనరల్ కోర్టుకు నివేదించినట్లు తెలుస్తోంది. ఆయన సిఫార్సు ఆధారంగా గౌతం అదానీపై అరెస్టు వారెంట్ రద్దయినట్లు తెలుస్తోంది. మరోవైపు సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్ భారీగా రుణాలు సేకరించిన అమెరికా బ్యాంకులు, పెట్టుబడిదారుల నుండి ఈ వాస్తవాన్ని దాచిపెట్టారని అమెరికా ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

ఇటు జగన్కు అదానీ రూ.1750 కోట్ల లంచం ఆరోపణల వివాదంలో మరో ట్విస్ట్. తమకు అదానీతో సంబంధం లేదని, సెకీతోనే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నామని జగన్ బృందం తెలిపింది. తమ ప్రతినిధులు భారత అధికారులకు లంచమిచ్చినట్టు US కోర్టులో అభియోగాలే నమోదవ్వలేదని తాజాగా అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అవి అజూర్ పవర్, CDPQ ప్రతినిధులపైనే ఉన్నాయంది. మరి జగన్ లంచం తీసుకున్నారా? తీసుకుంటే అదానీ కాకుండా ఎవరిచ్చినట్టు? అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

Related Posts
17న మహాకుంభ మేళాకు లోకేశ్
Minister Nara Lokesh visit to America has ended

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాల్లో ఒకటైన మహాకుంభమేళా.17న మహాకుంభ మేళాకు లోకేశ్.ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన కుటుంబంతో కలిసి ఈ నెల 17న ప్రయాగ్ మహాకుంభమేళాకు Read more

Houthi: హూతీలపై అమెరికా భారీ క్షిపణులతో దాడులు
హూతీలపై అమెరికా భారీ క్షిపణులతో దాడులు

యెమెన్​లోని హూతీ ఉగ్రవాదులపై ఆదివారం రాత్రి చేసిన క్షిపణి దాడిలో సుమారు 30 మంది మరణించారు. హూతీల ఏరివేత లక్ష్యంగా మార్చి 15 నుంచి అమెరికా వారిపై Read more

మూసీపై మరోసారి స్పష్టత ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Police are a symbol of sacrifice and service. CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డి యాదవుల అభివృద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి పై సదర్ సమ్మేళనంలో కీలక వ్యాఖ్యలు చేసారు.యాదవుల కోసం మరిన్ని రాజకీయ అవకాశాలను అందించడానికి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం Read more

కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎంపిక
భారత్-కెనడా సంబంధాల్లో మార్పు? – మార్క్ కార్నీ

కెనడా నూతన ప్రధాన మంత్రిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. లిబరల్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్టు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించిన Read more

Advertisements
×