ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ మహిళా విభాగం నేత సస్పెన్షన్ కలకలం రేపింది.తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం తరఫున పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్బాబు ఓ ప్రకటన విడుదల చేశారు.ఇతిహాస గ్రంథాలైన రామాయణం, మహాభారతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియా మహిళా స్టేట్ కోఆర్డినేటర్ గాయత్రిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇతిహాస గ్రంథాలైన రామాయణం, మహాభారతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో గాయత్రిని సస్పెండ్ చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి అశోక్ బాబు ఈ విషయంపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పరిపాలనా నియమావళిని పాటించకపోవడం, ప్రజా భావనలను గాయపర్చే విధంగా మాట్లాడడం కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.గాయత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ట్విట్టర్లో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. విచారణకు ఆదేశిస్తున్నాము’ అని అశోక్బాబు ప్రకటనలో తెలిపారు.
కార్యక్రమాల్లో
విజయవాడకు సందిరెడ్డి గాయత్రి గతంలో తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలకు కౌంటరిస్తూ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఆమె ప్రతి అంశంపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ టీడీపీ వాదనను బలంగా వినిపించారు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. అయితే ఆ సోషల్ మీడియా కారణంగానే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా కొన్ని అంశాల విషయంలో గాయత్రిపై పార్టీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అందుకే ఆమెను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.ఈ సస్పెన్షన్ అంశంపై గాయత్రి స్పందించాల్సి ఉంది.
ఏం జరిగిందంటే..?
ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఓ ట్విటర్ స్పేస్లో యూఏఈ, పాకిస్థాన్ లాంటి ఇస్లామిక్ దేశాలకు చెందిన వారితోపాటు కొద్ది మంది భారతీయులు కూడా పాల్గొన్నారు. ఈ స్పేస్లో గాయత్రి మాట్లాడుతూ ‘‘నేను ప్రస్తుతం ఇండియాలో ఉన్నా. ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో హిందువులు, ముస్లింల మధ్య కాదు హిందువులు, హిందువుల మధ్య యుద్ధం జరుగుతోంది. పాకిస్థాన్ పౌరులను పెళ్లాడిన మహిళలు తమ ఫ్యామిలీలను చేరుకోలేక ఏడుస్తున్నారు. నా పేరు గాయత్రి, నాది సౌత్ ఇండియా లోని ఆంధ్రప్రదేశ్. నేను అతివాదిని కాదు. గత వారం రోజులుగా మాలో మేము ఫైట్ చేసుకుంటున్నాం’’ అన్నారు.‘ప్రతి ముస్లింను, ప్రతి దేశాన్ని అలా (ఉగ్రవాద దేశంగా) పిలవొద్దని చెప్పాను. భారతీయుల్ని ప్రతి దేశంలోనూ ఆహ్వానిస్తారు’’ అని గాయత్రి తెలిపారు.
Read Also :TTD: తిరుమలలో భక్తుల కోసం ‘ఆర్ఎఫ్ఐడీ’ విధానం