Andhra Pradesh: టీడీపీ మహిళా నేత గాయత్రి సస్పెండ్

Andhra Pradesh: టీడీపీ మహిళా నేత గాయత్రి సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ మహిళా విభాగం నేత సస్పెన్షన్ కలకలం రేపింది.తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం తరఫున పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబు ఓ ప్రకటన విడుదల చేశారు.ఇతిహాస గ్రంథాలైన రామాయణం, మహాభారతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియా మహిళా స్టేట్ కోఆర్డినేటర్ గాయత్రిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇతిహాస గ్రంథాలైన రామాయణం, మహాభారతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో గాయత్రిని సస్పెండ్ చేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి అశోక్ బాబు ఈ విషయంపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ పరిపాలనా నియమావళిని పాటించకపోవడం, ప్రజా భావనలను గాయపర్చే విధంగా మాట్లాడడం కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.గాయత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ట్విట్టర్లో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. విచారణకు ఆదేశిస్తున్నాము’ అని అశోక్‌బాబు ప్రకటనలో తెలిపారు.

Advertisements

కార్యక్రమాల్లో

విజయవాడకు సందిరెడ్డి గాయత్రి గతంలో తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలకు కౌంటరిస్తూ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఆమె ప్రతి అంశంపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ టీడీపీ వాదనను బలంగా వినిపించారు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. అయితే ఆ సోషల్ మీడియా కారణంగానే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సోషల్ మీడియా వేదికగా కొన్ని అంశాల విషయంలో గాయత్రిపై పార్టీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. అందుకే ఆమెను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.ఈ సస్పెన్షన్ అంశంపై గాయత్రి స్పందించాల్సి ఉంది.

ఏం జరిగిందంటే..?

ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఓ ట్విటర్ స్పేస్‌లో యూఏఈ, పాకిస్థాన్ లాంటి ఇస్లామిక్ దేశాలకు చెందిన వారితోపాటు కొద్ది మంది భారతీయులు కూడా పాల్గొన్నారు. ఈ స్పేస్‌లో గాయత్రి మాట్లాడుతూ ‘‘నేను ప్రస్తుతం ఇండియాలో ఉన్నా. ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో హిందువులు, ముస్లింల మధ్య కాదు హిందువులు, హిందువుల మధ్య యుద్ధం జరుగుతోంది. పాకిస్థాన్ పౌరులను పెళ్లాడిన మహిళలు తమ ఫ్యామిలీలను చేరుకోలేక ఏడుస్తున్నారు. నా పేరు గాయత్రి, నాది సౌత్ ఇండియా లోని ఆంధ్రప్రదేశ్. నేను అతివాదిని కాదు. గత వారం రోజులుగా మాలో మేము ఫైట్ చేసుకుంటున్నాం’’ అన్నారు.‘ప్రతి ముస్లింను, ప్రతి దేశాన్ని అలా (ఉగ్రవాద దేశంగా) పిలవొద్దని చెప్పాను. భారతీయుల్ని ప్రతి దేశంలోనూ ఆహ్వానిస్తారు’’ అని గాయత్రి తెలిపారు.

Read Also :TTD: తిరుమలలో భక్తుల కోసం ‘ఆర్‌ఎఫ్‌ఐడీ’ విధానం

Related Posts
ఏపీలో యువత కు ఉపాధి అవకాశాలు
ఏపీలో యువత కు ఉపాధి అవకాశాలు

ఏపీ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం పథకం: అమలు దిశగా కీలక సర్వే ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కసరత్తు మొదలుపెట్టింది. Read more

మొబైల్ కొనివ్వలేదని 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
మొబైల్ కొనివ్వలేదని 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

సమాజంలో మారుతున్న జీవనశైలి, టెక్నాలజీపై పెరుగుతున్న ఆధారపడటంతో చిన్న వయస్సులోనే పిల్లలు సెల్‌ఫోన్లపై మోజుపడుతున్నారు.కొన్ని కుటుంబాలు తీరని విషాదాన్ని ఎదుర్కొంటున్నాయి.ఇలాంటి ఓ విషాద ఘటన అనంతపురం జిల్లా Read more

Chandrababu Naidu: బాణసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం
Chandrababu Naidu: బాణసంచా పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం

కైలాసపట్నం అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదం Read more

పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CBN Nellour

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త ప్రకటించారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకంపై స్పష్టత ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా, ప్రతీ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×