ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ (DSC-2025) ప్రజలలో విశేషంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ డీఎస్సీ ప్రక్రియలో భాగంగా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థుల కోసం ముఖ్యమైన సడలింపులను ప్రభుత్వం ప్రకటించింది.
కొత్త అర్హత ప్రమాణాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం, ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), మరియు దివ్యాంగ (PwD) అభ్యర్థులకు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికీ కనీసం డిగ్రీలో 40% మార్కులు ఉంటే చాలు అనే వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు డీఎస్సీ కోసం డిగ్రీలో 45% మార్కులు అవసరమయ్యేవి. అయితే, టెట్ (TET) మరియు B.Ed కోర్సులకు ఇప్పటికే 40% మార్కులతో అర్హత ఉంటుంది. అదే ప్రమాణాన్ని డీఎస్సీకి కూడా వర్తింపజేయాలన్న అభ్యర్థుల నిరసనలు, విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, జనరల్ (OC) కేటగిరీకి చెందిన అభ్యర్థులకు మాత్రం ఈ సడలింపు వర్తించదు. వారికి తప్పనిసరిగా డిగ్రీలో కనీసం 50% మార్కులు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ముఖ్యమైన తేదీలు:
ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమైన ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపు మే 15 వరకు కొనసాగనుంది. అలాగే మే 30 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ ఇప్పటికే డీఎస్సీ పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాగా, ఏపీ డీఎస్సీ-2025కి సంబంధించిన పూర్తి వివరాలు అభ్యర్థులు పూర్తి వివరాలు, సిలబస్, జిల్లాల వారీ ఖాళీల వివరాలు, అర్హత ప్రమాణాలు, CBT మోడల్ పరీక్షల వివరాలను అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in/ లో తెలుసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో బోధనలో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో, ఈ మెగా డీఎస్సీకి పెద్ద ఎత్తున అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Read also: TTD: తిరుమలలో భక్తుల కోసం ‘ఆర్ఎఫ్ఐడీ’ విధానం