AP DSC: ఏపీ మెగా డీఎస్సీకి తాజా ఉత్తర్వులు

AP DSC: ఏపీ మెగా డీఎస్సీకి తాజా ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డీఎస్సీ (DSC-2025) ప్రజలలో విశేషంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ డీఎస్సీ ప్రక్రియలో భాగంగా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థుల కోసం ముఖ్యమైన సడలింపులను ప్రభుత్వం ప్రకటించింది.

Advertisements

కొత్త అర్హత ప్రమాణాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం, ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), మరియు దివ్యాంగ (PwD) అభ్యర్థులకు డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికీ కనీసం డిగ్రీలో 40% మార్కులు ఉంటే చాలు అనే వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు డీఎస్సీ కోసం డిగ్రీలో 45% మార్కులు అవసరమయ్యేవి. అయితే, టెట్ (TET) మరియు B.Ed కోర్సులకు ఇప్పటికే 40% మార్కులతో అర్హత ఉంటుంది. అదే ప్రమాణాన్ని డీఎస్సీకి కూడా వర్తింపజేయాలన్న అభ్యర్థుల నిరసనలు, విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, జనరల్ (OC) కేటగిరీకి చెందిన అభ్యర్థులకు మాత్రం ఈ సడలింపు వర్తించదు. వారికి తప్పనిసరిగా డిగ్రీలో కనీసం 50% మార్కులు ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ముఖ్యమైన తేదీలు:

ఏప్రిల్ 20 నుంచి ప్రారంభ‌మైన‌ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపు మే 15 వరకు కొన‌సాగ‌నుంది. అలాగే మే 30 నుంచి అభ్య‌ర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేరకు పాఠ‌శాల విద్యశాఖ ఇప్ప‌టికే డీఎస్సీ పూర్తి షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. కాగా, ఏపీ డీఎస్సీ-2025కి సంబంధించిన పూర్తి వివ‌రాలు అభ్యర్థులు పూర్తి వివరాలు, సిలబస్, జిల్లాల వారీ ఖాళీల వివరాలు, అర్హత ప్రమాణాలు, CBT మోడల్ పరీక్షల వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://apdsc.apcfss.in/ లో తెలుసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలలో బోధనలో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో, ఈ మెగా డీఎస్సీకి పెద్ద ఎత్తున అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.ఈ నోటిఫికేష‌న్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. 

Read also: TTD: తిరుమలలో భక్తుల కోసం ‘ఆర్‌ఎఫ్‌ఐడీ’ విధానం

Related Posts
కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్
CM Revanth's request to the

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లను మంజూరు Read more

Mithun Reddy : ఏప్రిల్ 3 వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు
Mithun Reddy ఏప్రిల్ 3 వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు

Mithun Reddy : ఏప్రిల్ 3 వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ కుంభకోణంపై చర్చలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ హయాంలో మద్యం Read more

Nandigam Suresh: టీడీపీ నేతపై దాడికి దిగిన నందిగం సురేష్!
Nandigam Suresh: టీడీపీ నేతపై దాడికి దిగిన నందిగం సురేష్!

ఉద్దండ్రాయునిపాలెంలో ఉద్రిక్తత.. టీడీపీ నేతపై వైసీపీ నేత నందిగం సురేశ్ దాడి! ఏపీ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. గతంలో వివాదాల్లో నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ Read more

HYD Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు భారీ షాక్
Hyderabad Metro fares hiked!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో ఛార్జీల పెంపు రూపంలో ఊహించని భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. మెట్రో సేవలను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×