AP Fiber Net

ఏపీ ఫైబర్ నెట్ సంచలన నిర్ణయం

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ హయాంలో అక్రమ నియామకాలు జరిగాయని తెలిపారు. వైసీపీ నేతల సిఫార్సులతో అడ్డగోలు నియామకాలు చేశారన్నారు. ఎక్కువ మందిని అవసరం లేకున్నా నియమించారని జీవీ రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వ సంస్థ అక్రమాలకు అడ్డాగా
ఏపీలో ఫైబర్ నెట్ పేరుతో కేబుల్ ప్రసారాలు, ఇంటర్నెట్ పంపిణీదారుగా ఉన్న ప్రభుత్వ సంస్థ అక్రమాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఫైబర్ నెట్ ను తమ జేబు సంస్థగా వాడుకుని అందులో భారీ ఎత్తున ఉద్యోగుల్ని సిఫార్సులతో నియమించారు. వీరితో ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఫైబర్ నెట్ కనెక్షన్లు 10 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గిపోయాయి. దీంతో ఇందులో ప్రక్షాళన ప్రారంభించిన ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రక్షాళన చేపట్టిన జీవీ

ముఖ్యంగా వంట మనుషులు, డ్రైవర్లను ఫైబర్ నెట్ లో ఉద్యోగులుగా నియమించారన్నారు. వీరంతా వైసీపీ నేతల ఇళ్లలో వంట మనుషులు, డ్రైవర్లుగా పనిచేస్తున్నారని జీవీ రెడ్డి తెలిపారు. అందుకే వీరిని గుర్తించి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా అక్రమ నియామకాలపై దృష్టిపెట్టడంతో పాటు ఫైబర్ నెట్ కనెక్షన్ల ఛార్జీల తగ్గింపు, కొత్త కనెక్షన్లను తక్కువ ధరకే ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.

Related Posts
తిరువూరు ఎమ్మెల్యేకు నోటీసులు జారీ..!
Notices issued to Tiruvuru MLA.

అమరావతి: టీడీపీకి తిరువూరు ఎమ్మెల్యే అనేక సమస్యలు తెచ్చి పెడుతున్నారు ఇటీవల ఓ గ్రామంలో సిమెంట్ రోడ్ వివాదంలో ఆయన జోక్యం చేసుకోవడంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం Read more

బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి ?
బర్డ్ ఫ్లూ భయం – పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభావం, వ్యాప్తి, నివారణ మార్గాలు

బర్డ్ ఫ్లూ భయం – పౌల్ట్రీ పరిశ్రమపై ప్రభావం, వ్యాప్తి, నివారణ మార్గాలు బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి? బర్డ్ ఫ్లూ (Avian Influenza) ఒక వైరల్ Read more

ఏపీకి నాయ‌క‌త్వం వ‌హించే సామ‌ర్థ్యం కేవలం పవన్ కే ఉంది – విజయసాయి రెడ్డి
vijayasai cbn

వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉద్దేశిస్తూ.. 75 ఏళ్ల వృద్ధుడు ఆంధ్రప్రదేశ్‌కు Read more

కోనసీమ ప్రభల తీర్థం గురించి తెలుసా?
prabhala tirdam

సంక్రాంతి పండుగకు కోనసీమలో ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. ఈ సందర్భంలో నిర్వహించే "ప్రభల తీర్థం" ఆనవాయితీకి ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ ప్రాంతంలో ముఖ్యంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *