AP Fiber Net

ఏపీ ఫైబర్ నెట్ సంచలన నిర్ణయం

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ హయాంలో అక్రమ నియామకాలు జరిగాయని తెలిపారు. వైసీపీ నేతల సిఫార్సులతో అడ్డగోలు నియామకాలు చేశారన్నారు. ఎక్కువ మందిని అవసరం లేకున్నా నియమించారని జీవీ రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వ సంస్థ అక్రమాలకు అడ్డాగా
ఏపీలో ఫైబర్ నెట్ పేరుతో కేబుల్ ప్రసారాలు, ఇంటర్నెట్ పంపిణీదారుగా ఉన్న ప్రభుత్వ సంస్థ అక్రమాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఫైబర్ నెట్ ను తమ జేబు సంస్థగా వాడుకుని అందులో భారీ ఎత్తున ఉద్యోగుల్ని సిఫార్సులతో నియమించారు. వీరితో ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఫైబర్ నెట్ కనెక్షన్లు 10 లక్షల నుంచి 5 లక్షలకు తగ్గిపోయాయి. దీంతో ఇందులో ప్రక్షాళన ప్రారంభించిన ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రక్షాళన చేపట్టిన జీవీ

ముఖ్యంగా వంట మనుషులు, డ్రైవర్లను ఫైబర్ నెట్ లో ఉద్యోగులుగా నియమించారన్నారు. వీరంతా వైసీపీ నేతల ఇళ్లలో వంట మనుషులు, డ్రైవర్లుగా పనిచేస్తున్నారని జీవీ రెడ్డి తెలిపారు. అందుకే వీరిని గుర్తించి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా అక్రమ నియామకాలపై దృష్టిపెట్టడంతో పాటు ఫైబర్ నెట్ కనెక్షన్ల ఛార్జీల తగ్గింపు, కొత్త కనెక్షన్లను తక్కువ ధరకే ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నారు.

Related Posts
వంశీ కేసు లో కీలక పరిణామాలు
గన్నవరం కిడ్నాప్ కేసు: వంశీ రిమాండ్‌లో కీలక పరిణామాలు

గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో మరో Read more

CBN -Pawan : సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ
Deputy CM Pawan Kalyan meet CM Chandrababu today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య కీలక భేటీ జరిగింది. తాజాగా ముగిసిన క్యాబినెట్ Read more

సుప్రీం కోర్ట్ లో అవినాష్ రమేష్ కు ఊరట
సుప్రీం కోర్ట్ లో అవినాష్ రమేష్ కు ఊరట

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నివాసం మరియు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఈరోజు విచారణ నిర్వహించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న Read more

రూ.524 కోట్లతో ప్రజాప్రతినిధులు, అధికారుల బిల్డింగ్స్ కు టెండర్లు – ఏపీ సర్కార్
amaravati buildings

అమరావతిలో ప్రజాప్రతినిధులు, IAS, IPS అధికారులు కోసం నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్ టవర్ల పెండింగ్ పనులను పూర్తి చేయడానికి CRDA (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కసరత్తు ప్రారంభించింది. Read more