మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక మూలధన సాయం కింద రూ. 397 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం వినియోగించుకోవచ్చు. కేంద్రం మొత్తం రూ. 2,530 కోట్లు కేటాయించగా, మొదటి విడతలో ఆరు రాష్ట్రాలకు రూ. 615 కోట్లు మంజూరు చేసింది. ఇందులో అధిక భాగం, అంటే రూ. 397 కోట్లు (64.55%) ఒక్క ఆంధ్రప్రదేశ్కే కేటాయించింది.
నిధుల కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం కేరళ, మధ్యప్రదేశ్, గోవా, అస్సాం, హిమాచల్ప్రదేశ్లతో పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సాయం అందించింది. అయితే మొత్తం కేటాయించిన నిధుల్లో అత్యధిక భాగం ఏపీకి రావడం రాష్ట్రానికి మంచి అవకాశం అని అధికారులు తెలిపారు. ఈ నిధులతో అవసరమైన నిర్మాణాలు చేపట్టేందుకు ఆయా శాఖలు వినియోగించుకోవచ్చు.అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం సీఎస్ఎస్ (కేంద్ర ప్రాయోజిత పథకాలు) కింద ఆంధ్రప్రదేశ్కు అదనంగా రూ. 1,000 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను రెవెన్యూ, వ్యవసాయ పద్దుల కింద మార్చి తొలి వారంలో రాష్ట్ర ఖాతాలో జమ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతోనే ఈ నిధులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
డీఐఎల్ఆర్ఎంపీ (డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్) కింద అందిన నిధులను భూమి రికార్డుల డిజిటలైజేషన్, రెవెన్యూ రికార్డుల ఆధునికీకరణ, 12 అంకెల విశిష్ట సంఖ్య వంటి ప్రాజెక్టులకు ఉపయోగించనున్నారు. ఏపీ ప్రభుత్వం ముందుగా ఖర్చు చేసిన నిధులను సీఎస్ఎస్ కింద తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

నేతల పాత్ర
ఆంధ్రప్రదేశ్కు ఈ నిధులు కేటాయించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్.పి. సిసోడియా, సీసీఎల్ఏ జయలక్ష్మిల చొరవ ప్రముఖంగా పనిచేసింది. ప్రత్యేక సహాయ నిధుల కింద ఏపీకి భారీగా నిధులు రావడం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడనుంది.కేంద్రం ప్రకటించిన ఈ నిధులు ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మేలు చేస్తాయి. మౌలిక సదుపాయాలు, భూసంబంధిత ప్రాజెక్టులు, వ్యవసాయ అభివృద్ధికి వీటిని సద్వినియోగం చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడి ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహాయ నిధులు ఎప్పుడూ కీలకమైనవే. ఈసారి అధిక భాగం ఏపీకి కేటాయించడం రాష్ట్రానికి గొప్ప అవకాశమని చెప్పొచ్చు.
గత వారం అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల ఆంధ్రప్రదేశ్కు ₹608.08 కోట్ల సహాయ నిధులను ఆమోదించింది, గత సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ఆంధ్రప్రదేశ్.