TTD: చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి..టీటీడీ సిబ్బందిపై వేటు

TTD: చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి..టీటీడీ సిబ్బందిపై వేటు

తిరుమలలో మరోసారి భద్రతా విఫలమైందని తెలిపే ఘోర ఘటన చోటు చేసుకుంది. భక్తులు చెప్పులతోనే శ్రీవారి ఆలయ మహాద్వారం వరకు చేరుకోవడం, ఆలయంలోకి అడుగు పెట్టే స్థితికి చేరుకోవడం టీటీడీ భద్రతాపరంగా ఎంతగా వెనుకబడ్డదనే దానికి నిదర్శనం. ఈ ఘటనపై టీటీడీ వెంటనే స్పందించినా, ఇప్పటికే జరిగిన నిర్లక్ష్యం ఎంతో పెద్దవిషయమని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisements

వివరాల్లోకి వెళ్తే

ముగ్గురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, ఫుట్‌పాత్‌ హాల్‌, డౌన్‌ స్కానింగ్ పాయింట్లు ఇలా అన్ని భద్రతా సరిహద్దులను దాటి, చెప్పులతోనే ఏకంగా శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు వచ్చేశారు. ఆలయంలోకి అడుగు పెట్టేందుకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్న సమయంలో టీటీడీ సిబ్బంది వారిని గుర్తించారు. వారు చెప్పులు వేసుకున్నది గమనించిన సిబ్బంది వెంటనే వారిని నిలిపివేశారు. ఆలయంలోకి చెప్పులతో వెళ్లే నిబంధన లేదని, చెప్పులు తీసేసి వెళ్లాలని సూచించడంతో ముగ్గురూ చెప్పులను అక్కడే వదిలేసి ఆలయంలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ఆలయంలో, ఇటువంటి నిర్లక్ష్యంతో భక్తులు చెప్పులతోనే మహాద్వారం వరకూ చేరడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. టీటీడీ విధినిర్వహణపై ప్రజలలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రత సిబ్బంది వీరిని గుర్తించకపోవడం వల్లే వారు పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. వాళ్లు ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఈ దుస్థితి తలెత్తింది.

టీటీడీ చర్యలు – ఏడుగురు సస్పెండ్, మరి ఆరుగురిపై ప్రతిపాదన

ఈ ఘటనను టీటీడీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. సిబ్బందిపై చర్యల తీసుకుంది. ఏడుమందిని సస్పెండ్ చేసింది. మరో ఆరుమందిని సస్పెండ్ చేయాలంటూ ప్రతిపాదించింది. ఆయా ఉద్యోగుల పేర్లు, పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటనను టీటీడీ విడుదల చేసింది. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలం కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన వివరించింది. ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు సస్పెండ్ అయ్యారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని కోరుతూ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదన పంపారు. సస్పెండ్ అయిన వారిలో చక్రపాణి- సీనియర్ అసిస్టెంట్, వాసు- జూనియర్ అసిస్టెంట్, టీటీడీ భద్రతా సిబ్బంది- డీ బాలకృష్ణ (పీఎస్జీ 0807), వసుమతి (సీడబ్ల్యూపీఎస్జీ 514067), టీ రాజేష్ కుమార్ (ఏడబ్ల్యూపీఓ 512475), కే వెంకటేష్ (పీఎస్జీ 932), ఎం బాబు (ఏడబ్ల్యూపీఓ) ఉన్నారు. సస్పెన్షన్‌కు సిఫారసు చేసిన ఎస్పీఎఫ్ సిబ్బంది- సీ రమణయ్య (ఇన్‌ఛార్జ్ ఏఎస్ఐ 1101), బీ నీలబాబు (సీటీ 3595), డీఎస్‌కే ప్రసన్న (సీటీ 3602), సత్యనారాయణ (ఏఎస్ఐ 696), పోలి నాయుడు (సీటీ 3516), ఎస్ శ్రీకాంత్ ఉన్నారు. తిరుమలలో జరుగుతున్న ఈవిధమైన సంఘటనలు భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు. టీటీడీ పాలకమండలి, అధికారులు మరింతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Read also: Subramanya Swami: టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి

Related Posts
మీటింగ్‌కు హాజరుకాలేదు అనే కారణంతో 99 ఉద్యోగులను తొలగించిన CEO..
fired

ఒక US-based CEO, 99 ఉద్యోగులను ఒక్కసారిగా ఉద్యోగం నుండి తొలగించి, ఆన్‌లైన్‌లో పెద్ద చర్చలకు కారణమయ్యారు. ఈ CEO, తన సంస్థలో జరిగిన ఒక ముఖ్యమైన Read more

తెలంగాణల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

అగ్రికల్చర్ & ఫార్మసీ కోర్సులకు టీజీ ఈఏపీసీఈటీ ఏప్రిల్ 29,30 తేదీల్లో, ఇంజనీరింగ్ కోర్సులకు మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ Read more

చైనాతో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన భారత్
చైనాతో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన భారత్

భారతదేశం, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ, భారత ప్రభుత్వం ఈ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది. Read more

హిందీ జాతీయ భాష కాదు: రవిచంద్రన్ అశ్విన్
హిందీ జాతీయ భాష కాదు: రవిచంద్రన్ అశ్విన్

స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ఒక ప్రైవేట్ కళాశాల కార్యక్రమంలో పాల్గొని, తన కెరీర్ విషయంతో పాటు భారతదేశంలో హిందీ భాష స్థితిగతులపై వ్యాఖ్యలు చేసి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×