ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ
తెలంగాణ ప్రభుత్వం గురువారం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చిన్నపాటి పునర్వ్యవస్థీకరణను చేపట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు.
రవాణా,మార్కెటింగ్ శాఖలో మార్పులు
K. సురేంద్ర మోహన్ – రవాణా కమిషనర్, సహకార సంఘాల కమిషనర్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ మరియు మార్కెటింగ్ డైరెక్టర్ (FAC) బాధ్యతల నుంచి P. ఉదయ్ కుమార్ ను రిలీవ్ చేశారు.
SK యాస్మీన్ బాషా – హార్టికల్చర్ & సెరికల్చర్ డైరెక్టర్గా ఉన్న ఈమెను తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (FAC) గా నియమించారు.

ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖలో మార్పులు
RV కర్ణన్ – ఆరోగ్యశ్రీ సీఈవోగా (FAC) బాధ్యతలు అప్పగించారు.
శివశంకర్ లోతేటి – హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తొలగించి, సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మార్పులు
సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ – FAC బాధ్యతల నుంచి రిలీవ్ చేసి, K. హరితను బదిలీ చేశారు.
K. హరిత – వాణిజ్య పన్నుల డైరెక్టర్ గా నియమితులయ్యారు.
అదనపు కలెక్టర్ల బదిలీలు
సంచిత్ గంగ్వార్ – వనపర్తి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బాధ్యతల నుంచి బదిలీ అయ్యి నారాయణపేట అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా నియమితులయ్యారు.
హెచ్ఏసీఏ, తెలంగాణ ఫుడ్స్ మార్పులు
కే. చంద్రశేఖర్ రెడ్డి – హెచ్ఏసీఏ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతూ, తెలంగాణ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ (FAC) గా నియమితులయ్యారు.
B. శ్రీనివాస రెడ్డి – తెలంగాణ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.
ఈ మార్పులు రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను మెరుగుపరచడంలో కీలకంగా మారనున్నాయి.