Iran: అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన

Read Time:  1 min
Israel Iran War: మధ్యప్రాచ్యంలో క్షిపణుల విధ్వంసం
Israel Iran War: మధ్యప్రాచ్యంలో క్షిపణుల విధ్వంసం
FONT SIZE
GET APP

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరిపే ఉద్దేశ్యం తమకు లేదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అంతర్జాతీయ వేదికలపై అమెరికా తీరును తీవ్రంగా ఎండగట్టారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న అశాంతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణమని లారిజానీ విమర్శించారు. ఒకప్పుడు “అమెరికా ఫస్ట్” (America First) అని నినదించిన ట్రంప్, ఇప్పుడు దాన్ని “ఇజ్రాయెల్ ఫస్ట్” (Israel First) గా మార్చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రాజకీయ లబ్ధి కోసం అమెరికా సైనికుల ప్రాణాలను ట్రంప్ పణంగా పెడుతున్నారని ఆరోపించారు.

Read Also: Donald Trump: ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు హతం

No talk of talks with America: Iran's sensational statement
No talk of talks with America: Iran’s sensational statement

ఆత్మరక్షణే మా ప్రాధాన్యత

ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడుల నుండి ఇరాన్ తనను తాను రక్షించుకుంటోందని లారిజానీ తెలిపారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి వెనకాడబోమని, చర్చల కంటే ప్రతిఘటనకే మొగ్గు చూపుతామని ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో స్పష్టం చేశారు.

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ దాడులు

మరోవైపు, ఇరాన్ మద్దతు ఉన్న ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్’ సంస్థ ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, రాకెట్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ, అమెరికా సైనికులెవరూ గాయపడలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.