పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారతదేశం దాడి చేస్తుందని పాకిస్తాన్ రక్షణ మంత్రి అంటున్నారు. అయితే, ఈ వివాదంలో చైనా పాత్ర ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ జరుగుతోంది. భారతదేశం చర్యలు తీసుకోకుండా చైనా, పాకిస్తాన్ కూటమి అడ్డుకోగలదా? ఈ వివాదంలో పాకిస్తాన్కు చైనా ఎంత వరకు అండగా ఉంటుంది? చైనా ప్రయోజనాలు ఏంటి? అనేవి కీలకమైన ప్రశ్నలు.
పహల్గాం దాడి తర్వాత “భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను గమనిస్తున్నాం” అని చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి చెప్పారు.

పాకిస్తాన్, చైనాల మధ్య చర్చలు
పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దార్, చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి చర్చల సందర్భంగా ‘ఇరుపక్షాలు సంయమనం పాటించాలి’ అని సూచించినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. పహల్గాంలో పర్యటకుల మీద తీవ్రవాదుల దాడి జరిగిన తర్వాతి రోజు చైనా ఈ దాడిని ఖండించింది. ‘‘టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా మేము వ్యతిరేకిస్తున్నాం’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. భారత్లో చైనా రాయబారి కూడా బాధితుల పట్ల సానుభూతి ప్రకటించారు.
భద్రత గురించి పాకిస్తాన్ ఆందోళనలు ఏంటి?
వీలైనంత త్వరగా నిష్పాక్షిక దర్యాప్తు పూర్తి చేసేందుకు చైనా అండగా నిలుస్తుందని పాకిస్తాన్ విదేశాంగమంత్రి ఇషాక్ దార్తో సమావేశం సందర్భంగా చైనా విదేశాంగమంత్రి వాంగ్ యి అన్నారు. “గొడవల వల్ల భారత్ లేదా పాకిస్తాన్ ప్రాథమిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. అంతే కాకుండా ప్రాంతీయ శాంతి భద్రతలకు విఘాతం’’ అని వాంగ్ యి చెప్పినట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. పహల్గాం దాడి విషయంలో పాకిస్తాన్పై వచ్చిన ఆరోపణల్ని ఆ దేశ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ తిరస్కరించారు.
Read Also: In-Pak War: ముందే మొదలైన భారత్-పాక్ వార్ ? ఎక్కడంటే..!