అమెరికాలోని తెలుగు సంఘాలతో జరిగిన చందాల వివాదం పెద్ద దుమారమే రేపింది. ఫెడరల్ నేషనల్ మార్ట్గేజ్ అసోసియేషన్ (ఫ్యానీ మే) తీసుకున్న తాజా నిర్ణయం అందరిని షాక్కు గురి చేసింది.ఈ వివాదం కారణంగా ఫ్యానీ మే సంస్థ ఏకంగా 700 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందులో అత్యధికంగా వర్జీనియా, డాలస్ ప్రాంతాలవారే ఉన్నారు. ముఖ్యంగా ఈ లేఆఫ్స్లో దాదాపు 200 మంది తెలుగువారు ఉండటం గమనార్హం.ఉద్యోగులు అమెరికాలోని కొన్ని తెలుగు సంఘాలతో కలిసి మ్యాచింగ్ గ్రాంట్లను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఓ ఉద్యోగి స్వచ్ఛంద విరాళం ఇస్తే, కంపెనీ అదే మొత్తాన్ని కలిపి విరాళం ఇవ్వడమే.అయితే కొన్ని సంఘాలకు తప్పుడు పత్రాలు సృష్టించి భారీ మొత్తంలో బోగస్ విరాళాలు చూపించారట. ఈ నేపథ్యంలో తానా, ఆటా వంటి తెలుగు సంఘాల పేర్లు ఈ ఆరోపణల్లో వినిపిస్తున్నాయి.

FBI రంగంలోకి దిగింది
ఈ చందాల మోసంపై ఇప్పటికే FBI దర్యాప్తు మొదలుపెట్టింది. ఉద్యోగం కోల్పోయిన వారిలో ఒకరు తానాలో రీజినల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నట్లు తెలిసింది. మరోరు ఆటా మాజీ అధ్యక్షుడి భార్య అని సమాచారం.నార్త్ కరోలీనా కోర్టు తానాకు సమన్లు జారీ చేసింది. 2019 నుండి 2024 వరకు అందిన విరాళాల రికార్డులు సమర్పించాలన్నది ఆదేశం.
ఫ్యానీ మే కఠిన నిర్ణయం
ఈ వివాదం నేపథ్యంలో ఫ్యానీ మే నైతికతను ప్రాముఖ్యతనిచ్చింది. మోసానికి పాల్పడ్డవారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇకపై ఇటువంటి చర్యలపై మినహాయింపు ఉండదని చెప్పింది.ఇలాంటి మ్యాచింగ్ గ్రాంట్ల మోసం కేసులో ఆపిల్ సంస్థ కూడా గత ఏడాది 100 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థలు సీరియస్గా తీసుకోవడంతో మిగిలిన కంపెనీలలో టెన్షన్ నెలకొంది.ఈ పరిణామాలు అమెరికాలోని ఎన్నో తెలుగువారిని కుదిపేశాయి. చెడ్డ పేరుతో బాధపడాల్సిన పరిస్థితి వచ్చినా, కొన్ని సంఘాల తీరుతోనే ఈ దుస్థితి చోటుచేసుకుంది.
Read Also : Donald Trump: బైడెన్ పాలనలో పెరిగిన అమెరికా వాణిజ్య లోటు: ట్రంప్