ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల రాష్ట్ర యువత కోసం స్ఫూర్తిదాయకమైన దృష్టిని పంచుకున్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, వారు ఉద్యోగాలు పొందే స్థాయిలో ఆగిపోయి, మరింతగా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే సంస్థలు స్థాపకులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతిలోని విట్-ఎపి యూనివర్సిటీలో జరిగిన ‘వి లాంచ్పాడ్ 2025 – స్టార్టప్ ఎక్స్ పో’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, విద్యార్థులను ప్రభుత్వ పెడుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో, యూనివర్సిటీ క్యాంపస్లో నూతనంగా నిర్మించిన మహాత్మాగాంధీ, వి.వి. గిరి, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్లను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ను ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దడం
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను ప్రపంచంలో ఒక ప్రధాన ఇన్నోవేషన్ హబ్గా మారుస్తున్నామని వెల్లడించారు.అమరావతిని ‘క్వాంటం వ్యాలీ’గా తీర్చిదిద్దాలని ఆయన స్పష్టం చేశారు.అలాగే, రాష్ట్ర రాజధాని నిర్మాణం పనులు మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభం అవుతున్నాయని కూడా చెప్పారు.
విట్ అధినేత జి. విశ్వనాథన్తో ఉన్న అనుబంధం
చంద్రబాబు, విట్-ఎపి యూనివర్సిటి వ్యవస్థాపకులు డా. జి.విశ్వనాథన్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు.సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి, రాజకీయాలలో (పార్లమెంటు సభ్యునిగా), విద్యా రంగంలో అసాధారణ విజయాలు సాధించిన విశ్వనాథన్ను అభినందించారు. 2014 ఎన్నికల ఫలితాల ముందే, అమరావతిలో విట్ ఏర్పాటుకు అనుమతి కోరినప్పుడు, వెంటనే 100 ఎకరాలు కేటాయించానని, భవిష్యత్తులో మరిన్ని భూములు అవసరమైతే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.విట్ల అమరావతి క్యాంపస్లో 95% ప్లేస్మెంట్స్ ఉన్నందుకు, అలాగే ప్రపంచంలోని మేటి 100 విశ్వవిద్యాలయాలలో విట్ స్థానం దక్కినందుకు చంద్రబాబు నాయుడు గర్వపడతానని చెప్పారు.విట్ యూనివర్సిటీ, అన్ని విభాగాలలో అమరావతి క్యాంపస్ అగ్రస్థానంలో నిలవాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు.
యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచన
చంద్రబాబు నాయుడు విద్యార్థులకు, సృజనాత్మక ఆవిష్కరణలు చేస్తూ ముందుకు సాగాలని, తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. యువతను మార్పు, అభివృద్ధికి నడిపించే శక్తిగా ఉంచాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also : Amaravathi : 42 నియోజకవర్గాల రూపు రేఖలు మారబోతున్నాయి