ఈరోజు స్టాక్ మార్కెట్లు రెచ్చిపోయాయి ఉదయం నుంచి మంచి ఊపు కనిపించింది.ముగింపులోనూ అదే జోరు కొనసాగింది.సెన్సెక్స్, నిఫ్టీ రెండూ భారీ లాభాల్లో ముగిశాయి.మార్కెట్ మూడ్ చూస్తే,ఇన్వెస్టర్ల ఉత్సాహం మామూలుగా లేదన్న విషయం స్పష్టమవుతోంది.ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.విదేశీ పెట్టుబడులు మాత్రం చురుగ్గా కొనసాగుతున్నాయి.ముఖ్యంగా బ్లూ చిప్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించాయి.ఈ రెండు అంశాలే మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణమయ్యాయి.

సెన్సెక్స్, నిఫ్టీ లేటెస్ట్ గణాంకాలు
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,005 పాయింట్లు ఎగబాకింది.ఇది మొత్తంగా 80,218 పాయింట్ల వద్ద ముగిసింది.అదే విధంగా నిఫ్టీ కూడా 289 పాయింట్లు పెరిగింది.ఇది 24,328 వద్ద స్థిరపడింది.ఈ సంఖ్యలు మార్కెట్ బలాన్ని చూపిస్తున్నాయి.అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ కూడా మెరుగైంది.37 పైసలు లాభపడి,రూ.85.04కి చేరుకుంది.ఇది ఆర్థిక స్థిరత్వానికి సంకేతంగా చెప్పవచ్చు.
టాప్ గెయినర్స్ ఎవరు?
ఈరోజు మార్కెట్ దూకుడుకు ప్రధానంగా కొన్ని స్టాక్లు గణనీయంగా సహాయపడ్డాయి అవే:
రిలయన్స్ ఇండస్ట్రీస్ – 5.27% లాభంతో టాప్ గెయినర్గా నిలిచింది.
సన్ ఫార్మా – 3.08% పెరిగింది.
టాటా స్టీల్ – 2.42% లాభపడింది.
ఎస్బీఐ – 2.36% జంప్ చేసింది.
యాక్సిస్ బ్యాంక్ – 2.35% పెరిగింది.
ఈ స్టాక్లు మార్కెట్ను మోస్తున్నాయి అనడం అతిశయోక్తి కాదు.
నష్టాల్లో ఉన్న స్టాక్లు
మరియు కొన్ని స్టాక్లు మాత్రం లాభాల ట్రెండ్ను ఫాలో కాలేకపోయాయి ముఖ్యంగా:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ – 1.89% పడిపోయింది.
అల్ట్రాటెక్ సిమెంట్ – 1.05% నష్టపోయింది.
హిందుస్థాన్ యూనిలీవర్ – 0.52% తగ్గింది.
నెస్లే ఇండియా – 0.42% నష్టాన్ని చూశింది.
బజాజ్ ఫైనాన్స్ – 0.21% తగ్గింది.
ఈ కంపెనీల పనితీరు మార్కెట్ సెంటిమెంట్కు కొంత డౌన్సైడ్ ఇచ్చినట్లే.మొత్తం మీద,ఈరోజు స్టాక్ మార్కెట్ పర్వత శిఖరాల దిశగా పరుగులు తీసిన రోజు.డొమెస్టిక్ ఇన్వెస్టర్లు,విదేశీ పెట్టుబడిదారులు ఇద్దరూ ఒకే దిశగా వెళ్లడం మార్కెట్కు బలం ఇచ్చింది. అంచనాలను మించిన కంపెనీ ఫలితాలు కూడా ఈ ఊపుకు బలంగా నిలిచాయి.
Read Also : ED Office Fire : నీరవ్, చోక్సీ కేసుల దర్యాప్తుపై ఈడీ కీలక ప్రకటన