వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సర్వీసులు దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో వేగంగా గమ్యస్థానాలను చేరడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇవి సాధారణ రైళ్లతో పోల్చుకుంటే, ఎక్కువ డిమాండ్ను కలిగి ఉన్నాయి. ప్రయాణికులు వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఎంచుకుంటున్నారు, ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశ పెట్టడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ కొత్త రైళ్లలో 16 కోచ్లు ఉంటాయి. 613 బెర్తులతో 11 ఏసీ 3-టయర్ కోచ్లు, 188 బెర్తులతో నాలుగు ఏసీ 2-టయర్ కోచ్లు మరియు 24 బెర్తులతో ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్లు ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రత్యేక సదుపాయాలను అందిస్తున్నాయి.

వందే భారత్ స్లీపర్ రైళ్లకు కీలక మార్పులు:
సరికొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు, ప్రయాణికుల అనుకూలంగా, మరింత సౌకర్యవంతంగా తయారయ్యాయి. ఈ రైళ్లలో USB ఛార్జింగ్ పిన్లు, రీడింగ్ బల్బ్స్, దివ్యాంగుల కోసం ప్రత్యేక బెర్తులు, పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ వంటి అనేక ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఇక, సెక్యూరిటీ కెమెరాలు, ఇన్సైడ్ డిస్ప్లే ప్యానెల్స్ వంటివి కూడా రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తున్నాయి.
ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా కొత్త రూట్లపై ప్రతిపాదనలు:
ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర రైల్వే అధికారులు కొత్త రూట్లపై ప్రతిపాదనలు చేస్తూ, ప్రయాణికులకు మరింత అనుకూలమైన మార్గాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాచిగూడ లేదా నాంపల్లి నుంచి మైసూరుకు వందే భారత్ స్లీపర్ను ప్రవేశ పెట్టాలనే ప్రతిపాదనలు రైల్వే అధికారుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత రద్దీ మార్గం కావడం, ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు ఈ రెండు నగరాల మధ్య ఈ ఎక్స్ప్రెస్ నడిపించాలనే ప్రతిపాదనలను రూపొందిస్తోన్నట్లు చెబుతున్నారు. దీనిపై ప్రయాణికుల అభిప్రాయాలను కూడా సేకరిస్తోన్నారని అంటున్నారు. ఇప్పటికే కాచిగూడ- యశ్వంత్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. తెల్లవారు జామున 5:45 నిమిషాలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 20703 వందే భారత్ రైలు మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్పూర్కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 2:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 20704 ఎక్స్ప్రెస్ రాత్రి 11 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
కొత్తగా నడిపించదలిచిన వందే భారత్ స్లీపర్ను మైసూరు వరకూ నడిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి అనుగుణంగా కాచిగూడ నుంచి బెంగళూరు మీదుగా మైసూరు వరకు కొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రూట్ను ఖరారు చేయవచ్చని సమాచారం.
వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రత్యేకతలు:
ఈ రైళ్లలో అందిస్తున్న సౌకర్యాలు బాగా ప్రత్యేకమైనవి. ఆటోమేటిక్ ఎక్స్టీరియర్ పాసింజర్ డోర్లు, సెన్సర్ ఆధారంగా ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, మరియు అత్యాధునిక సదుపాయాలతో ఈ రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతం అవుతుంది. ప్రస్తుత స్లీపర్ రైళ్లకు కూడా ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
భవిష్యత్తులో మరిన్ని మార్పులు:
భవిష్యత్తులో, వందే భారత్ ఎక్స్ప్రెస్ మరిన్ని మార్పులతో ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. రైల్ మార్గాలు, ప్రత్యేకతలు మరింత అభివృద్ధి చేయడం, ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించడం ప్రాముఖ్యంగా ఉంది.