हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Delimitation: నేడే తమిళనాడులో డీలిమిటేషన్‌ సమావేశం

Ramya
Delimitation: నేడే తమిళనాడులో డీలిమిటేషన్‌ సమావేశం

చెన్నైలో అఖిలపక్ష సమావేశం – దక్షిణాది ఐక్యరూపం

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ సీఎంలు, ఇతర ప్రధాన రాజకీయ నేతలు పాల్గొంటున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాల హక్కులను హరించబోతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, దీనికి వ్యతిరేకంగా సమగ్ర వ్యూహాన్ని రూపొందించేందుకు నేతలు చర్చించనున్నారు. జనాభా ఆధారంగా ఎంపీ స్థానాలను పునర్వ్యవస్థీకరించడం దక్షిణాదికి నష్టం కలిగించనుందని, ఇది ప్రాంతీయ అసమతుల్యతకు దారి తీస్తుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా కొనసాగుతుంది.

డీలిమిటేషన్‌పై డీఎంకే ఉద్యమం

ఈ భేటీకి దక్షిణాది రాష్ట్రాల నుంచి 20కి పైగా పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు చెన్నై చేరుకున్నారు. డీఎంకే ప్రకటించిన వివరాల ప్రకారం మొత్తం 24 మంది నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని తెలిపారు. కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఒడిశా బీజేడీ నేతలు, శిరోమణి అకాలీదల్‌ పార్టీ నాయకులు కూడా ఈ సమావేశానికి వస్తున్నట్లు డీఎంకే తెలిపింది.

కేంద్రం నిర్ణయంపై దక్షిణాది నేతల విమర్శలు

తమిళనాడు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రతిపాదనల ప్రకారం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం తెచ్చిపెడుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్ కూడా ఈ ప్రతిపాదనను ఖండిస్తూ బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.

కేటీఆర్ స్పందన – దక్షిణాది హక్కుల పోరాటం

బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “ఒక భారతీయుడిగా దేశం ఎదుగుతున్న తరుణంలో చాలా గర్వపడుతున్నాం. కానీ, జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారంటే ఎలా?” అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో 2.8% జనాభా ఉన్నప్పటికీ, జీడీపీ వృద్ధి రేటు దేశంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. “జనాభా నియంత్రణ విషయంలో మంచి ఫలితాలు సాధించిన రాష్ట్రాలకు శిక్ష విధించటమేంటి?” అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

రేవంత్ రెడ్డి వ్యతిరేక ధోరణి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్‌ను బహిరంగంగానే విమర్శించారు. “దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడే దిశగా ఈ సమావేశం ఎంతో కీలకం” అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం న్యాయంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆయన ఆరోపించారు.

అఖిలపక్ష సమావేశం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది?

చెన్నైలో జరుగుతున్న ఈ సమావేశంలో డీలిమిటేషన్‌పై ఆయా పార్టీల నేతలు ఏకతాటిపైకి రావడం, ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ఖాయం. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ భేటీని నిర్వహిస్తున్నారు. రేపటి సమావేశం అనంతరం ప్రధాన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం
0:31

ముంబై లోకల్ రైలులో అగ్నిప్రమాదం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, కొనుగోలుకు ఇదే మంచి అవకాశం

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

నెల ముందే తిరిగొస్తున్న వ్యోమగాములు..అసలు ఏంజరిగిందంటే !!

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

📢 For Advertisement Booking: 98481 12870