statue of a doctor in Rg Kar hospital. There are different opinions on social media

ఆర్జీకర్‌ ఆసుపత్రిలో వైద్యురాలి విగ్రహం.. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు

statue of a doctor in Rg Kar hospital.. There are different opinions on social media
statue of a doctor in Rg Kar hospital.. There are different opinions on social media

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఘటన చోటుచేసుకున్న ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో తాజాగా మృతురాలికి నివాళిగా ఓ అమ్మాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అది బాధితురాలిని అగౌరపర్చేలా ఉందంటూ పలువురు నెట్టింట విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

ఆసిత్ సైన్‌ అనే శిల్పి ఈ మహిళ విగ్రహాన్ని రూపొందించారు. హత్యాచార సమయంలో బాధితురాలు అనుభవించిన క్షోభను ప్రతిబింబించేలా రూపొందించిన ఆ విగ్రహానికి ‘క్రై ఆఫ్‌ ది అవర్‌’ అని పేరు పెట్టారు. దీన్ని ఇటీవల ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ప్రాంగణంలోని ప్రిన్సిపల్‌ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేశారు. ”ఇది బాధితురాలి విగ్రహం కాదు. ఘటన సమయంలో ఆమె అనుభవించిన వేదన, హింసకు ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేశాం” అని తెలిపారు. దీనికి సంబంధించిన చిత్రాలను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయడంతో ఇవి కాస్తా వైరల్‌గా మారాయి.

ఈ విగ్రహం ఏర్పాటు వెనుక ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. నెట్టింట దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ”ఇది బాధితురాలిని అవమానించడమే. ఓ అత్యాచార బాధితురాలిని ఆధారంగా చేసుకుని ఇలాంటి విగ్రహాలను ఎలా ఏర్పాటు చేస్తారు? ఇది మంచి సలహా అని ఎవరు చెప్పారు? దీన్ని ఎవరు ఆమోదించారు?” అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు.

ఈ ఏడాది ఆగస్టు 9న కోల్‌కతా లోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో 31 ఏళ్ల జూనియర్‌ వైద్యురాలి సెమినార్‌ హాల్‌లో అర్ధనగ్న స్థితిలో విగత జీవిగా కన్పించిన సంగతి తెలిసిందే. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు పాల్పడిన సివిల్‌ వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ని అరెస్టు చేశారు. ప్రస్తుతం దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు, ఈ ఘటనను నిరసిస్తూ కోల్‌కతాలో జూనియర్‌ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది.

Related Posts
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ ఓటమి పై స్పందించిన రియాన్ పరాగ్
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ ఓటమి పై స్పందించిన రియాన్ పరాగ్

ఐపీఎల్ 2025లో భాగంగా,ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(42 బంతుల్లో 8 Read more

పరీక్షలు రాసే విద్యార్థులు సీఎం కీలక సందేశం..!
CM Revanth Reddy key message to students writing exams.

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థుల కోసం Read more

క్వాలీజీల్ అత్యాధునిక సమర్ధత కేంద్రం
QualiZeel Launches 3rd State of the Art Competence Center in Hyderabad

హైదరాబాద్ : క్వాలిటీ ఇంజనీరింగ్ మరియు డిజిటల్ పరివర్తన సేవలలో అంతర్జాతీయంగా అగ్రగామి అయిన క్వాలీజీల్ , హైదరాబాద్‌లో తమ కొత్త సమర్ధత కేంద్రంను ప్రారంభించినట్లు వెల్లడించింది. Read more

మోదీతో శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే భేటీ..!
WhatsApp Image 2024 12 16 at 3.57.13 PM

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మూడురోజుల పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని Read more

Advertisements
×