కేఎస్సీఏపై ఎఫ్ఐఆర్ దాఖలు అన్యాయం: హైకోర్టులో పిటిషన్ వేసిన కర్ణాటక క్రికెట్ సంఘం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై తమపై నమోదైన FIR ను సవాలు చేస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA) హైకోర్టును ఆశ్రయించింది.
శుక్రవారం నాడు కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురామ్ భట్, కార్యదర్శి శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ కలిసి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు న్యాయస్థానం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది.
పిటిషన్లో తమపై FIR నమోదు చేయడం పూర్తిగా అన్యాయమని, అసలు బాధ్యులను వదిలేసి నేరం లేని తమను తప్పుగా ఇరికించేందుకు ప్రయత్నం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
KSCA ఒక స్టేడియం నిర్వహణ సంస్థ మాత్రమేనని, ప్రజల రాకపోకల నియంత్రణ, గేట్ నిర్వహణ వంటి బాధ్యతలు తమ పరిధిలోకి రావని స్పష్టంగా వివరించారు.

ప్రభుత్వ ఆమోదంతోనే విజయోత్సవ కార్యక్రమం: కేఎస్సీఏ వివరణ
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వ ఆదేశాల మేరకే నిర్వహించామని KSCA తన పిటిషన్లో స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు సమక్షంలో విధానసౌధలో జరిగిన అభినందన కార్యక్రమాన్ని ఉదాహరణగా చూపింది.
ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకుల పిలుపు మేరకు ఏర్పాటు చేసిన వేడుకల వల్ల అణచివేయలేని గందరగోళం ఏర్పడినప్పటికీ, దానికి తమను బాధ్యులను చేయడం దుర్మార్గమని సంఘం ఆరోపించింది.
KSCA స్టేడియాన్ని కేవలం అద్దెకు ఇచ్చే వ్యవస్థ మాత్రమేనని, ఈవెంట్ నిర్వహణకు తాము సంబంధం లేదని స్పష్టం చేసింది.
అభిమానుల ప్రవేశం, శాంతిభద్రతల బాధ్యతలు పూర్తి స్థాయిలో RCB మేనేజ్మెంట్, ఈవెంట్ నిర్వాహకులు మరియు పోలీసులు చూసుకోవాల్సిన విషయాలేనని వివరించింది.
“మేము క్రికెట్ నిర్వహణలో భాగమైతే గానీ, జన సమూహ నియంత్రణ విషయాల్లో మాకేం పాత్ర లేదని పిటిషన్లో పేర్కొంది.
పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం: KSCA ఆరోపణ
పోలీసులు మరియు ప్రభుత్వం తమ వైఫల్యాలను దాచిపెట్టేందుకు KSCA పై అనవసర ఒత్తిడి తీసుకొస్తున్నాయన్న ఆరోపణలు కూడా పిటిషన్లో ఉన్నాయి.
తమ సీనియర్ ఆఫీస్ బేరర్లను నేరవారిగా చూపే ప్రయత్నం జరుగుతుండటం అత్యంత దిగజారుడు చర్య అని పేర్కొంది.
నేరానికి సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించటం హేయమైన పని అని, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టును కోరారు.
ఈ ఘటనలో అసలు బాధ్యత వారిపైనే ఉంటే, ఎందుకు తప్పుదోవ పట్టించేందుకు తమ పేర్లు చేర్చారనే ప్రశ్నను KSCA ప్రస్తావించింది.
ప్రభుత్వ యంత్రాంగం మరియు పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా వ్యవహరించి ఉంటే, తొక్కిసలాట వంటి విషాద ఘటన చోటుచేసుకునేది కాదని అభిప్రాయపడ్డారు.
క్రికెట్ పరిమితిలోనే మేము ఉంటాం: KSCA స్పష్టీకరణ
తాము కేవలం స్టేడియం నిర్వహణ, క్రికెట్ మ్యాచ్ల ఆతిథ్యానికి మాత్రమే పరిమితమవుతామని KSCA స్పష్టం చేసింది. బయటి ఈవెంట్ల నిర్వహణకు గానీ, అభిమానుల రాకపోకలపై నియంత్రణకు గానీ తమకు ఎలాంటి భాద్యత ఉండదని తేల్చిచెప్పింది.
ఈ విషయంలో ఉన్నతాధికారుల అనుమతితోనే స్టేడియాన్ని అద్దెకు ఇచ్చామని తెలిపింది. “ఇది KSCA తప్పు కాదు. అధికారుల నిర్లక్ష్యమే ఇంతటి ఘోరానికి కారణమైంది” అని స్పష్టం చేసింది.
ఈ కేసులో తాము నిందితులుగా మారిన విధానాన్ని హైకోర్టు పరిశీలించి, తగిన న్యాయం చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థల బాధ్యతను గుర్తించి నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు.
Read also: Manoj Tiwary: ఆర్సీబీ ఘటనపై మండిపడ్డ మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ