India vs New Zealand : ODI టాస్ భారత్‌దే, సిరీస్ ఎవరిది?

Read Time:  1 min
India vs New Zealand
India vs New Zealand
FONT SIZE
GET APP

India vs New Zealand : న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌లో టీమిండియా టాస్ నెగ్గి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకూ అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది.

సిరీస్ సమీకరణాన్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా మేనేజ్‌మెంట్ జట్టులో కీలక మార్పులు చేసింది. తొలి రెండు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పించింది. ప్రసిద్ధ్ కృష్ణను పక్కన పెట్టి అర్ష్‌దీప్‌ను తుది జట్టులోకి తీసుకుంది.

Read also : Ahmedabad Flight Crash Case : ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

రెండో వన్డేలో భారత్ ఓడిన తర్వాత అర్ష్‌దీప్‌ను (India vs New Zealand) ఆడించకపోవడంపై తీవ్ర విమర్శలు రావడంతో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో అర్ష్‌దీప్ కీలకంగా మారతాడని టీమ్ భావిస్తోంది.

భారత్ తుది జట్టు:

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.

ఈ సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచింది. దీంతో నేటి మూడో వన్డే సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్‌గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.