జగన్ ను జైలుకు పంపండి: ఏపీ మంత్రి డిమాండ్!

Read Time:  1 min
జగన్ ను జైలుకు పంపండి: ఏపీ మంత్రి డిమాండ్!
FONT SIZE
GET APP

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను కలిసి వారిని పరామర్శించడంతో పాటు ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలతో ఏపీ మంత్రులు విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి గుంటూరులో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా జగన్ మిర్చి యార్డుకు వెళ్లి న్యూసెన్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులపై ప్రేమను నటిస్తున్నారు: మంత్రి

మంత్రి బాల వీరాంజనేయ స్వామి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. వైసీపీకి చెందిన దళిత నాయకులు జైలులో ఉంటే జగన్ వెళ్లలేదని ఆయన గుర్తు చేశారు. ఇక గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులపై ప్రేమ ఉన్నట్టు జగన్ మాట్లాడుతున్నాడని, గత ప్రభుత్వ హయాంలో రైతులను అడుగడుగున మోసం చేశారన్నారు.

జగన్ ను జైలుకు పంపండి: ఏపీ మంత్రి డిమాండ్!

జైలుకు పంపాలి

పోలీసులపై జగన్ అనుచిత వ్యాఖ్యలు దారుణం రైతు భరోసా నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో రైతులను జగన్ ఇబ్బంది పెట్టాడని, అటువంటి జగన్ కు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని, అన్ని విధాల జగన్ తిరస్కరణకు గురయ్యారు కాబట్టే ప్రజలు 11సీట్లు ఇచ్చి అధికారం నుంచి దూరం చేశారని తెలిపారు. పోలీసులను బట్టలూడదీసి కొడతామని జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మంత్రి బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. జగన్, ఆయన అనుచరులను జైలుకు పంపాలి సప్త సముద్రాలు దాటి వచ్చి అయినా అన్యాయం చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతామని జగన్ చేసిన వ్యాఖ్యల పైన మండిపడ్డారు. సప్త సముద్రాలు జగన్ దాటాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని, ఆయనకు ఆ శక్తి లేదని జగన్ పని అయిపోయిందని మంత్రి పేర్కొన్నారు. జగన్ కు మళ్ళీ అధికారం అందని ద్రాక్ష అంటూ మంత్రి బాల వీరాంజనేయ స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జగన్ ను ఆయన అనుచరులను కేసు పెట్టి జైలుకు పంపాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.